News March 26, 2025
GNT: రూ.15కోట్లతో విద్యుత్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

గుంటూరు-1, మంగళగిరి ఆర్టీసీ డిపోల్లో రూ.15కోట్లతో విద్యుత్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కాబోతున్నాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గుంటూరుకు 150 బస్సులు మంజూరైన సంగతి తెలిసిందే. 100 బస్సులు గుంటూరు డిపోకి, మిగిలిన 50 బస్సులు మంగళగిరి డిపోకు కేటాయించనున్నారు. బస్సులు ఛార్జింగ్ పెట్టేందుకు బుడంపాడు నుంచి 3kv విద్యుత్ లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ బస్సులు 40కి.మీ. ప్రయాణిస్తాయి.
Similar News
News January 20, 2026
ANU: ఫిబ్రవరి 3 నుంచి వ్యాయామ విద్య కోర్సుల పరీక్షలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి వ్యాయామ విద్య కోర్సుల పరీక్షలు ప్రారంభమవుతాయని పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం తెలిపారు. బీపీఈడీ, యుజీ పీఈడీ, ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 6వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించారు.
News January 20, 2026
పశు ఔషది విక్రయ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు : కలెక్టర్

జిల్లాలో పశు ఔషది విక్రయ కేంద్రాలు ఏర్పాటుకు నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీసీ హాలులో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు సరసమైన ధరలకు మంచి నాణ్యమైన జనరిక్ మందులను అందించడం కోసం.”పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు.
News January 20, 2026
ఇంటర్మీడియట్ పరీక్షలు ముందస్తు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా ప్రణాళిక ప్రకారం ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఇంటర్మీడియట్ పరీక్షల సన్నద్ధత, నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, సమీప ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలని, పోలీస్ శాఖతో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.


