News March 26, 2025

‘విజయనగరం జిల్లాలో రూ.194 కోట్లు చెల్లించాం’

image

విజయనగరం జిల్లాలో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 91,836 మంది రోగులు వైద్య సేవలు పొందారని జిల్లా మేనేజర్ రాంబాబు తెలిపారు. జిల్లాలో 66 ప్రభుత్వ ఆసుపత్రులు, 25 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో మొత్తం రూ.194 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రూ.20లక్షల వరకు ప్యాకేజీ పెంచినట్లు వెల్లడించారు.

Similar News

News March 31, 2025

జామి: ప్రమాదవశాత్తు గెడ్డలో పడి గొర్రెల కాపరి మృతి

image

జామి మండలం లక్ష్మీపురం గ్రామానికి సమీపంలో ఉన్న గెడ్డలో పడి అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి వారధి కృష్ణ చనిపోయాడు స్థానికులు తెలిపారు. మృతుడు ఆదివారం నుంచి కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం సుమారు 11 గంటల ప్రాంతంలో స్థానికులు గెడ్డలో శవం ఉన్నట్లు తెలిసి వెళ్లి చూడగా అతను వారధి కృష్ణగా గుర్తించారు. ప్రమాదవశాత్తు గెడ్డలో పడి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

News March 31, 2025

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన రంజాన్ : VZM SP

image

విజయనగరం జిల్లాలో రంజాన్ పండగ హిందూ – ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెల్లుబికి, పండగలో ఎటువంటి మత విద్వేషాలు, సంఘర్షలు, అల్లర్లు జరగకుండా ప్రశాంతయుతంగా ముగిసినట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినాన జిల్లాలో ఎటువంటి మత ఘర్షణలు తలెత్తకుండా జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు భద్రత చర్యలు సత్ఫలితాలనిచ్చాయని అన్నారు.

News March 31, 2025

బొబ్బిలి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

బొబ్బిలి సమీపంలోని దిబ్బగుడివలస – గుమ్మడివరం మధ్యలో రైలు పట్టాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని GRP హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు తెలిపారు. సదరు వ్యక్తి రైలు నుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడి మృతిచెంది ఉంటాడని ప్రాథమిక నిర్ధారణలో తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని ఎవరైనా గుర్తిస్తే బొబ్బిలి రైల్వే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!