News March 26, 2025

మెగాస్టార్-అనిల్ సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!

image

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఉగాది రోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిని వినోదభరితమైన చిత్రంగా రూపొందిస్తారని పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే చిరు ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తి చేసుకోగా, మే 9న విడుదల కానుంది. ఇక అనిల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.

Similar News

News January 2, 2026

వికారాబాద్: ఈ ఫ్యామిలీ GREAT

image

‘కలసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం’ అంటుంది VKBలోని బొంరాస్‌పేట మండలానికి చెందిన నీరటి నర్సమ్మ కుటుంబం. కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతున్న తరుణంలో నేటికీ మేము కలిసే ఉంటున్నామంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమెకు మొత్తం నలుగురు కుమారులు, వారి భార్యలు, ఆరుగురు మనవళ్లు,11 మంది మనవరాళ్లు, ముని మనవడు, ముని మనువరాలు మొత్తం 27 మంది ఒకే దగ్గర ఉంటూ అన్ని కార్యక్రమాలను కలిసి నిర్వహించుకుంటున్నారు.

News January 2, 2026

బాక్సాఫీసును షేక్ చేసే సినిమా ఏది?

image

2025లో టాలీవుడ్ నుంచి ‘OG’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మినహా ఏ సినిమా రూ.300Cr+ కలెక్ట్ చేయలేదు. ధురంధర్, చావా, కాంతార: ఛాప్టర్-1 వంటి ఇతర భాషల సినిమాలు రూ.700cr+ రాబట్టాయి. దీంతో ఈ ఏడాది రిలీజయ్యే టాలీవుడ్ భారీ ప్రాజెక్టులు బాక్సాఫీసు వద్ద ఏ మేరకు రాణిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ ‘రాజాసాబ్, ఫౌజీ’, NTR ‘డ్రాగన్’, రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులు ఈ లిస్టులో ఉన్నాయి.

News January 2, 2026

టికెట్ కొనాల్సిందే.. ఇంద్రకీలాద్రిపై కొత్త విధానం!

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రి ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సిఫార్సుల ద్వారా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ టికెట్లు కొనుగోలు చేసే విధానం అమలు చేయాలని మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ భావిస్తున్నారు. ఈ మార్పు వలన ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. దుర్గగుడికి సిఫార్సుల జాబితాలో దర్శనాలకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.