News March 25, 2024
అత్తతో హోలీ ఆడిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711344146963-normal-WIFI.webp)
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సోమవారం తన అత్త, కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డితో కలిసి హోలీ ఆడారు. ఈ సందర్భంగా అత్తా కోడళ్లు రంగులు పూసుకున్నారు. అనంతరం పాలకుర్తి ప్రజలకు ఎమ్మెల్యే హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News July 8, 2024
ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ ఛైర్మన్గా రాఘవరెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720421172269-normal-WIFI.webp)
తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్గా జంగా రాఘవరెడ్డి నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ బలోపేతానికి కృషి చేస్తానని రాఘవరెడ్డి చెప్పారు. నూతన కార్పొరేషన్ ఛైర్మన్ను పలువురు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
News July 8, 2024
రాజన్న నీవు దూరమైన నీ సాహసం చెరగని సంతకం: మంత్రి కొండా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720418430356-normal-WIFI.webp)
రాజన్న నీవు దూరమైనా.. నీ సాహసం చెరగని సంతకం, నీ ప్రస్థానం మరువని జ్ఞాపకం అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని, ప్రతి తెలుగు వాడి గుండెల్లో రాజశేఖర్ రెడ్డి నిలిచిపోయారని మంత్రి కొండా సురేఖ చెప్పుకొచ్చారు.
News July 8, 2024
WGL: మనస్తాపంతో మహిళా రైతు బలవన్మరణం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720421515691-normal-WIFI.webp)
రెండు సార్లు విత్తనాలు వేసినా.. మొలకెత్తకపోవడంతో మహిళా రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వర్ధన్నపేట మున్సిపాలిటీలోని గుబ్బెడి తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన కమలమ్మ 9 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తోంది. జూన్ నెలలో అప్పు తీసుకొచ్చి విత్తనాలు వేసినా వర్షాలు లేక మొలకెత్తలేదు. విత్తనాలు మొలకెత్తక, తెచ్చిన అప్పు తీర్చలేక మనస్తాపానికి గురైన కమలమ్మ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.