News March 26, 2025

నాకు టీబీ జబ్బు ఉండేది: సీనియర్ నటి

image

తనకు టీబీ జబ్బు ఉందని, కానీ దీనిని సీక్రెట్‌గా ఉంచానని నటి సుహాసిని తెలిపారు. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందనే భయంతో రహస్యంగా 6 నెలలపాటు చికిత్స తీసుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను 2సార్లు (6,36 ఏళ్లు) TBతో బాధపడ్డా. ఆ సమయంలో విపరీతంగా బరువు తగ్గి, వినికిడి శక్తి కూడా కోల్పోయా. ఆ తర్వాత దాని నుంచి కోలుకున్నా. ప్రస్తుతం TBపై ప్రజలకు అవగాహన కల్పించాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు.

Similar News

News April 1, 2025

మీరు ఫూల్ అయ్యారా ఫ్రెండ్స్!

image

మన స్కూల్ డేస్‌లో ఏప్రిల్ 1 వస్తుందంటే ఎవరిని ఎలా ఫూల్ చేయాలా అని ప్లాన్ చేసేవాళ్లం. ఇక ఆ రోజు.. గోడమీద బల్లి, నీ డ్రెస్‌పై ఏదో పడింది, మీ వాళ్లు వస్తున్నారు, నిన్ను పిలుస్తున్నారు.. అని ఆ ఏజ్‌లో మనలోని చాణక్య చతురతతో అవతలి వారిని నమ్మించి ‘ఏప్రిల్ ఫూల్..’ అని ఆనందించాం. ఇప్పుడు నిజ జీవితంలో కొందరి చేతిలో ఫూల్ అవుతున్నాం.. అది వేరే అనుకోండి. ఫూల్స్ డేతో మీకున్న మెమోరీస్, ఫీలింగ్స్ కామెంట్ చేయండి.

News April 1, 2025

దుమ్మురేపుతున్న ‘మ్యాడ్ స్క్వేర్’ కలెక్షన్లు

image

‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ కలెక్షన్లలో అదరగొడుతోంది. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.69.4 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ‘థియేటర్లలో నవ్వులు.. థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డులు’ అని రాసుకొచ్చింది. MADకు సీక్వెల్‌గా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

News April 1, 2025

గచ్చిబౌలి భూముల వ్యవహారంపై కేంద్రానికి బీజేపీ ఎంపీల వినతి

image

TG: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో తెలంగాణ బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని కోరారు. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఈటల రాజేందర్, అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు రాజ్యసభలో కె.లక్ష్మణ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని కోరారు.

error: Content is protected !!