News March 26, 2025
SLBCలో 33వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు

శ్రీశైలం ఎడమగట్టు పరిధి నాగర్కర్నూల్ జిల్లా అమ్రబాద్లోని SLBC టన్నెల్లో గల్లంతైన వారికోసం సహాయక చర్యలు మరింత ముమ్మరం చేశారు. బుధవారం 33వ రోజు సహాయక చర్యలు ప్రారంభించారు. మొత్తం 8మంది గల్లంతు కాగా వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే.మరో ఆరుగురి కోసం సహాయక చర్యలను చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News September 19, 2025
మాజీ సీఎం జగన్ రూట్ మార్పు

తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిన వైఎస్ జగన్ ప్రయాణంలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ వారధి వద్ద రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో జగన్ వాహనశ్రేణి ప్రకాశం బ్యారేజీ మీదుగా గన్నవరం బయలుదేరింది.
News September 19, 2025
HYD: నేడు HCUలో విద్యార్థి సంఘం ఎన్నికలు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుతుంది. నేడు ఉ.9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపస్లో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ అనంతరం సాయంత్రం బ్యాలెట్ బాక్స్లను ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపును ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు.
News September 19, 2025
ఎల్లంపల్లి ప్రాజెక్ట్.. 38 గేట్లు ఎత్తివేత

గురువారం కురిసిన వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులోని 62 గేట్లలో 38 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మత్సకారులు, తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.