News March 26, 2025

సిరిసిల్ల జిల్లాలో ఎక్కువైన ఎండ

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఎండ ఎక్కువైందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం రోజు ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. వీర్నపల్లి 39.0°c, కోనరావుపేట 38.9°c, రుద్రంగి 38.5°c, సిరిసిల్ల 38.4°c, °c,తంగళ్ళపల్లి తంగళ్లపల్లి 37.8°c, వేములవాడ 37.2°c, ఎల్లారెడ్డిపేట 37.2°c,లుగా నమోదు అయ్యాయి. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు సూచనలు జాగ్రత్తగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News March 2, 2026

పర్యావరణ హితంగా హోళీ జరుపుకోండి: ASF SP

image

హోళీ పండుగను ప్రకృతి సిద్ధమైన రంగులతో సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా SP నితిక పంత్ ప్రజలకు సూచించారు. రసాయన రంగుల వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని, పర్యావరణ హిత రంగులనే వాడాలని కోరారు. ఇతరుల ఇష్టాయిష్టాలను గౌరవిస్తూ వేడుకలు చేసుకోవాలన్నారు. బలవంతపు చందాలకు పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు.

News March 2, 2026

ఇజ్రాయెల్ దాడులు.. ‘హెజ్బొల్లా’పై లెబనాన్ నిషేధం

image

లెబనాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని షియా ఇస్లామిస్ట్ పొలిటికల్ పార్టీ అయిన ‘హెజ్బొల్లా’ మిలిటరీ, సెక్యూరిటీ కార్యకలాపాలపై నిషేధం విధించింది. రాజకీయాలకే పరిమితం కావాలని, వెంటనే ఆయుధాలు సరెండర్ చేయాలని పీఎం నవాఫ్ సలాం ఆదేశించారు. కాగా హెజ్బొల్లా గ్రూప్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరుట్‌పై విరుచుకుపడుతోంది. దీంతో లెబనాన్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

News March 2, 2026

MBNR: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

మహబూబ్ నగర్ జిల్లాలో హోలీ పండుగను సహజ రంగులతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, బలవంతంగా రంగులు చల్లడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి చర్యలు చేయరాదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సమయంలో డయల్- 100 లేదా 8712659360 ను సంప్రదించాలని చెప్పారు. జిల్లా ప్రజలకు ఎస్పీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.