News March 26, 2025

ముస్లిం కుటుంబాల మధ్య హిందువులు సేఫ్‌గా ఉండగలరా?: CM యోగి

image

తమ రాష్ట్రంలో అన్ని మతాలవారూ సేఫ్‌గానే ఉన్నారని UP CM యోగి అన్నారు. ‘హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లింలూ సురక్షితంగానే ఉంటారు. 100 హిందూ కుటుంబాల మధ్యలో ఓ ముస్లిం కుటుంబం అత్యంత సురక్షితంగా ఉండగలదు. 100 ముస్లిం కుటుంబాల మధ్య 50మంది హిందువులు సేఫ్‌గా ఉండగలరా? బంగ్లా, పాక్ దేశాలే నిదర్శనం. అఫ్గాన్‌లో హిందువులు ఏమయ్యారు? అక్కడ జరిగిన తప్పు మన వద్ద జరగకూడదు’ అని స్పష్టం చేశారు.

Similar News

News January 17, 2026

బొజ్జన్న కొండ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన బౌద్ధ బిక్షువులు

image

అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో గల బొజ్జన్న కొండ వద్ద శుక్రవారం నిర్వహించిన బౌద్ద మేళాలో దేశ విదేశాలకు చెందిన బౌద్ధ బిక్షువులు పాల్గొన్నారు. బౌద్ధ స్తూపం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మేళాలో పాల్గొన్న వారికి బుద్ధుని పంచశీల సూక్తులను వివరించారు. ప్రపంచ శాంతికి బుద్ధుని శాంతి మార్గమే శరణ్యమని సూచించారు.

News January 17, 2026

బొజ్జన్న కొండ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన బౌద్ధ బిక్షువులు

image

అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో గల బొజ్జన్న కొండ వద్ద శుక్రవారం నిర్వహించిన బౌద్ద మేళాలో దేశ విదేశాలకు చెందిన బౌద్ధ బిక్షువులు పాల్గొన్నారు. బౌద్ధ స్తూపం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మేళాలో పాల్గొన్న వారికి బుద్ధుని పంచశీల సూక్తులను వివరించారు. ప్రపంచ శాంతికి బుద్ధుని శాంతి మార్గమే శరణ్యమని సూచించారు.

News January 17, 2026

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు సర్వం సిద్ధం

image

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఈనెల 18వ తేదీన ఆదివారం నిర్వహించేందుకు NTA అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. SGS స్కూల్, గీతం స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, శ్లోకా ఏ బిర్లా స్కూల్‌లో పరీక్షలు జరగనున్నాయి. 1569 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 6 తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు, 9 తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదు.