News March 26, 2025
పార్వతీపురం: అన్న క్యాంటీన్ టైం టేబుల్ మార్పు

అన్న క్యాంటీన్ భోజనాల సమయాల్లో మార్పులు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమయాల్లో మార్పు ఇలా ఉండనుంది. • బ్రేక్ ఫాస్ట్: ఉదయం 7 గంటల నుంచి 8:30గంటల వరకు • లంచ్: మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.30 గంటల వరకు• డిన్నర్: సాయంత్రం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు ఉండనున్నాయి.
Similar News
News December 31, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026వ సంవత్సరం జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని, జిల్లా అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. వేడుకలను క్రమశిక్షణతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.
News December 31, 2025
అనకాపల్లి జిల్లాలో 92.45 శాతం పింఛన్లు పంపిణీ

అనకాపల్లి జిల్లాలో సాయంత్రం 5.42 గంటల వరకు 92.45 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 2,55,680 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,36,385 మందికి అందజేసినట్లు పేర్కొన్నారు. సబ్బవరం మండలంలో అత్యధికంగా 95.93 మందికి పింఛన్లు పంపిణీ చేసామన్నారు. మిగిలిన వారికి ఈనెల రెండవ తేదీన పంపిణీ చేస్తామన్నారు.
News December 31, 2025
జగిత్యాల: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ బి.సత్యప్రసాద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 నూతన సంవత్సరం జిల్లాలోని ప్రతి ఇంట్లో ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని నింపాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజల భాగస్వామ్యం, సహకారం ఇలాగే కొనసాగాలని కోరారు. రాబోయే ఏడాదిలో జగిత్యాల జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆయన అధికారులకు సూచించారు.


