News March 26, 2025
గాజువాకలో యువకుడి సూసైడ్

గాజువాక మండలం B.C రోడ్డులోని వాంబేకాలనీలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కారు డ్రైవర్గా పనిచేస్తున్న పవన్(21) ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక పరిస్థితులే కారణంగా చనిపోతున్నట్లు మృతుడు సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 1, 2025
ఏప్రిల్ 6న సింహాచలంలో శ్రీరామ నవమి వేడుకలు

సింహాచలం కొండపై గంగధార వద్ద ఉన్న సీతారామ స్వామి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఏవో సుబ్బారావు సోమవారం తెలిపారు. ఆరోజు ఉదయం 10:30 నుంచి దేవస్థానం అర్చకుల సమక్షంలో అత్యంత వైభవంగా స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. ఆరోజున భక్తులు విచ్చేసి స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొవాలన్నారు. స్వామి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో సుబ్బారావు తెలిపారు.
News April 1, 2025
విశాఖ మేయర్ పీఠంపై వీడనున్న ఉత్కంఠ..!

విశాఖ మేయర్ పీఠంపై మరికొద్ది రోజుల్లో సస్పెన్ష్ వీడనుంది. మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కలెక్టర్ ఎం.హరేంద్ర ప్రసాద్కు కూటమి కార్పొరేటర్లు నోటీసులు ఇవ్వగా.. ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ కార్పొరేటర్లకు సమాచారం అందించారు. అయితే YCPకార్పొరేటర్లను అధిష్ఠానం బెంగుళూరు తరలించగా.. కూటమి కూడా తమ కార్పొరేటర్లను టూర్కు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
News March 31, 2025
జీవీఎంసీలో రూ.510 కోట్ల ఆస్తిపన్ను వసూలు

గ్రేటర్ విశాఖలో రూ.510కోట్లు ఆస్తిపన్ను వసూళ్లు అయినట్లు కలెక్టర్&ఇంచార్జి కమీషనర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పన్నులు చెల్లించిన ప్రజలకు, వసూళ్లలో పాల్గొన్న జోనల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. 2023-24 సంవత్సరంకు గాను రూ.454కోట్లు వసూళ్లు చేయగా.. 2024-25లో రూ.510కోట్లు వసూళు చేయడం హర్షనీయమన్నారు.