News March 26, 2025

పార్వతీపురం జిల్లాలో చేపట్టిన ప్రగతిని వివరించిన కలెక్టర్

image

అమరావతి రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరుగుతున్న 3వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ హాజరయ్యారు. జిల్లాలో చేపడుతున్న ప్రగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకి కలెక్టర్ వివరించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మత్స్య, పరిశ్రమలు, పర్యాటకం, రైల్వే, రవాణా మొదలగు రంగాల ద్వారా జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News January 16, 2026

కరీంనగర్‌కు కనుమ శోభ.. మూగజీవాలకు మొక్కులు

image

సంక్రాంతి సంబరాల్లో భాగంగా చివరి రోజైన కనుమ పర్వదినాన్ని రైతులు ‘పశువుల పండుగ’గా జరుపుకుంటారు. ఈ క్రమంలో నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులు ఉదయాన్నే ఎద్దులు, ఆవులకు స్నానాలు చేయించారు. అనంతరం కొత్త పగ్గాలు, మెడలో మువ్వల పట్టీలు కట్టి, కొమ్ములకు రంగులు అద్ది అందంగా ముస్తాబు చేసి పూజలు నిర్వహించారు. ఏడాది పొడవునా వ్యవసాయ పనుల్లో తమకు తోడుగా నిలిచే పశువులకు రైతులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

News January 16, 2026

బాపట్ల: వెలుగులోకొచ్చిన 500ఏళ్ల గణపయ్య విగ్రహం!

image

అద్దంకి మండలం కొత్త రెడ్డిపాలెంలో పురాతన ఉండ్రాళ్ల గణపతి విగ్రహం గురువారం వెలుగులోకి వచ్చింది. కొత్త రెడ్డిపాలెం-చిన్న కొత్తపల్లి గ్రామాల మధ్య ఓ రైతు పొలంలో ఈ విగ్రహం బయటపడింది. పురావస్తు పరిశోధకులు జ్యోతి చంద్రమౌళి విగ్రహాన్ని పరిశీలించి 500 ఏళ్ల నాటి విగ్రహంగా ఆయన పేర్కొన్నారు. ఉండ్రాళ్ల గణపతి విగ్రహానికి గ్రామస్థులు పూజలు చేశారు

News January 16, 2026

కామారెడ్డి జిల్లాలో కొండెక్కిన ధరలు

image

కామారెడ్డి జిల్లాలో మాంసం ధరలు భగ్గుమంటున్నాయి. సంక్రాంతి ముగింపు వేడుక ‘కనుమ’ సందర్భంగా శుక్రవారం చికెన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. కిలో చికెన్ రూ.300 నుంచి రూ.330 వరకు పలుకుతుండగా, లైవ్ కోడి ధర రూ.210 దాటింది. మటన్ కిలో రూ.800కు చేరింది. పండుగ రద్దీతో పాటు కోళ్ల మేత ధరలు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. సామాన్యులకు మాంసం ప్రియమవడంతో బెంబేలెత్తుతున్నారు.