News March 26, 2025
HYD: రైళ్లలో హై అలర్ట్.. ఎక్కడికక్కడ పోలీసులు!

MMTS రైలులో జరిగిన ఘటనతో సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ అప్రమత్తమైంది. HYD, సికింద్రాబాద్ సహా SCR పరిధిలో నడిచే అన్ని రైళ్లలో ఎక్కడికక్కడ పోలీసుల తనిఖీలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ SCR జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళల భద్రతపై ఫోకస్ చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
Similar News
News November 10, 2025
ఖమ్మం: సమస్యల పరిష్కారంపై అధికారులు చురుకుగా ఉండాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వ్యతిరేక వార్తలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న సేకరణ సజావుగా జరగాలని, పాఠశాలల భోజన నాణ్యత పర్యవేక్షించాలని ఆదేశించారు. రెండు పడకల ఇళ్ల కేటాయింపులు, ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలుపై కూడా కలెక్టర్ అధికారులకు సూచనలు ఇచ్చారు.
News November 10, 2025
ధర్మేంద్ర హెల్త్పై రూమర్స్.. టీమ్ క్లారిటీ

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ <<18162519>>ధర్మేంద్ర<<>> ఇటీవల శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిందని, మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని జాతీయ మీడియా పేర్కొంది. వాటిని నటుడి టీమ్ ఖండించింది. ‘ఆయన కోలుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముంబైలోని ఆస్పత్రికి రొటీన్ చెకప్కు వెళ్లగా ఇలాంటి వార్తలు వచ్చాయి’ అని క్లారిటీ ఇచ్చారు.
News November 10, 2025
న్యూస్ రౌండప్

*రేపు HYD ఘట్కేసర్ NFC నగర్లో అందెశ్రీ అంత్యక్రియలు. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
*దేవాలయాల్లో తొక్కిసలాట నివారణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
*శంషాబాద్ విమానాశ్రయంలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్. 2.70 లక్షల ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా పునర్నిర్మాణం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
*లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


