News March 26, 2025
WGL: క్రమంగా తగ్గుతున్న మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మక్కలు (బిల్టి) క్వింటాకి సోమవారం రూ. 2265 పలకగా.. మంగళవారం రూ.2,250 పలికింది. బుధవారం మరింత తగ్గి రూ.2245కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే సూక పల్లికాయ క్వింటాకు రూ.6050 ధర రాగా.. పచ్చి పల్లికాయకి రూ.4300 ధర వచ్చింది.
Similar News
News April 1, 2025
గద్వాల: ‘ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి’

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాద్ నుంచి మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో గద్వాల జిల్లా నుంచి కలెక్టర్ సంతోష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News April 1, 2025
అమరచింత: రాత్రి వేళైనా కొనసాగుతున్న మున్సిపల్ వసూళ్లు

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ కేంద్రంలో సోమవారం రాత్రి 8 గంటలైనా మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ పన్నును వసూలు చేస్తున్నారు. దీనిపై పలువురు లబ్ధిదారులు పండుగ పూట, రాత్రయినా వసూలు చేస్తున్నారని వాపోయారు. అయినా ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని తెలపడంతో తప్పని పరిస్థితిలో చెల్లిస్తున్నట్లు లబ్ధిదారులు పేర్కొన్నారు.
News April 1, 2025
కామారెడ్డి: WOW.. రాయిని చీల్చి.. వృక్షంగా ఎదిగి!

ప్రకృతి అంతులేని శక్తికి నిదర్శనంగా నిలిచే ఒక అద్భుతమైన దృశ్యం నిజాంసాగర్ శివార్లో కనిపించింది. నిశ్చలంగా కనిపించే ఒక పెద్ద బండరాయిని చీల్చుకుంటూ ఓ మొక్క మొలకెత్తి, నేడు ఎదిగి వృక్షంగా మారింది. ఏది ఏమైనప్పటికీ, ఈ రాయిని చీల్చుకుని ఎదిగిన వృక్షం మనందరికీ ఒక గొప్ప సందేశాన్నిస్తోంది. అడ్డంకులు ఎంత పెద్దగా ఉన్నా, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చనే స్పూర్తినిస్తోంది.