News March 26, 2025

బిక్కనూర్: పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాసిన అమ్మాయి

image

తండ్రి మృతి చెందినా దుఃఖాన్ని దిగమింగుతూ పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థినిని చూసి పలువురు కంటతడి పెట్టారు. బిక్కనూర్‌కు చెందిన సత్యం అనే వ్యక్తి బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుమార్తె కీర్తన పుట్టెడు దుఃఖంలో పదో తరగతి పరీక్ష రాసింది. కన్న తండ్రి చనిపోయినా బాధను దిగమింగి పరీక్షలు రాసిన విద్యార్థినిని తోటి విద్యార్థులు ఓదార్చారు. అంతటి బాధలో పరీక్ష రాసిన అమ్మాయి గ్రేట్ కదా.

Similar News

News July 10, 2025

NZB జిల్లాలో 51.11 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం: కలెక్టర్

image

ఈ ఏడాది వన మహోత్సవంలో జిల్లా వ్యాప్తంగా 51.11 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పక్షం రోజుల్లోనే పూర్తి స్థాయిలో మొక్కలు నాటి సంపూర్ణ లక్ష్యం సాధించేలా ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశామన్నారు. గత సంవత్సరం వన మహోత్సవం సందర్భంగా 43 లక్షల మొక్కలు నాటారని చెప్పారు.

News July 10, 2025

NZB: కార్మికుల హక్కులు హరిస్తున్న బీజేపీ: MLCకవిత

image

2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల హక్కులను హరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను సవరించడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్రంలోని BJP ప్రభుత్వం స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు.

News July 10, 2025

NZB: ఫోక్ డాన్సర్ జానూ లిరి సందడి

image

ఫోక్ డాన్సర్ జానూలిరి బుధవారం నిజామాబాద్ నగరంలో సందడి చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అక్కడి కాలేజ్ విద్యార్థులతో కలిసి వివిధ పాటలకు ఫోక్ డాన్స్ చేసి అందరిని అలరించారు. నిజామాబాద్ రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు మంచి భవిష్యత్తుతో ఉన్నత శిఖరాలకు చేరుకొని తమ తల్లిదండ్రులకు పేరు తీసుకుని రావాలని సూచించారు.