News March 26, 2025
బిక్కనూర్: పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాసిన అమ్మాయి

తండ్రి మృతి చెందినా దుఃఖాన్ని దిగమింగుతూ పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థినిని చూసి పలువురు కంటతడి పెట్టారు. బిక్కనూర్కు చెందిన సత్యం అనే వ్యక్తి బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుమార్తె కీర్తన పుట్టెడు దుఃఖంలో పదో తరగతి పరీక్ష రాసింది. కన్న తండ్రి చనిపోయినా బాధను దిగమింగి పరీక్షలు రాసిన విద్యార్థినిని తోటి విద్యార్థులు ఓదార్చారు. అంతటి బాధలో పరీక్ష రాసిన అమ్మాయి గ్రేట్ కదా.
Similar News
News April 1, 2025
NZB: టీపీసీసీ అధ్యక్షుడికి బ్లాక్ బెల్ట్

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్కు కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 ప్రధానం చేశారు. ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమి నుంచి సర్టిఫికేట్ అందుకున్నారు. హైదరాబాదులోని YWCAలో 3 గంటల పాటు జరిగిన పరీక్షలో మహేశ్ కుమార్ గౌడ్ నెగ్గారు. ఈ సందర్భంగా ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమి నుంచి బ్లాక్ బెల్ట్ 7వ డాన్ గ్రాండ్ మాస్టర్ ఎస్.శ్రీనివాసన్ అందజేశారు.
News April 1, 2025
NZB: రాజీవ్ యువ వికాసంపై అవగాహన: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకంపై యువతకు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. ఈ పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పథకానికి వీలైనంత ఎక్కువ మంది నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇప్పటికే ఆయా శాఖల ద్వారా పత్రికా ప్రకటనలు విడుదల చేసి విస్తృత ప్రచారం కల్పించామన్నారు.
News March 31, 2025
నిజామాబాద్: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్ను తేల్చనుంది. నిజామాబాద్ జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.