News March 26, 2025
తిరుమల: టీటీడీ ట్రస్టులకు భారీగా పెరిగిన విరాళాలు

గడిచిన 9 రోజుల్లో వివిధ ట్రస్ట్లకు విరాళంగా రూ. 26.85 కోట్లు అందినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ‘X’ వేదికగా తెలిపారు. అత్యధికంగా శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్కు రూ.11.67 కోట్లు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు రూ.6.14 కోట్లు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్కు రూ.4.88 కోట్లు అందినట్లు చెప్పారు. తాజాగా టీటీడీ విద్యాదాన ట్రస్ట్కు రూ 1.01 కోట్లు విరాళం అందినట్లు చెప్పారు.
Similar News
News October 26, 2025
SRPT: కాంగ్రెస్ విధేయుడు అన్నెపర్తికే DCC పగ్గాలు?

సూర్యాపేట DCC అధ్యక్ష పదవి తుంగతుర్తికి చెందిన విధేయుడు అన్నెపర్తి జ్ఞానసుందర్కే దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 30-40 ఏళ్లు కాంగ్రెస్ను నమ్ముకుని, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు అండగా ఉంటూ, ప్రజా పోరాటాలు చేయడంలో ముందున్నారు.. పదేళ్లు అధికారం లేకున్నా పార్టీని వీడకుండా పనిచేసిన ఆయనకు పగ్గాలు అప్పగిస్తే కలసివస్తుందని అభిప్రాయపడుతున్నాయి. తుది నిర్ణయం అధిష్ఠానం చేతుల్లో ఉంది.
News October 26, 2025
టాస్ గెలిచిన భారత్

WWC: లీగ్ స్టేజిలో చివరి మ్యాచ్లో BANతో భారత్ తలపడుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన IND బౌలింగ్ ఎంచుకుంది. వర్షం పడుతుండటంతో ఆట కాస్త ఆలస్యమవనుంది.
IND: ప్రతీకా, స్మృతి, హర్లీన్, రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్(C), దీప్తి, ఉమా, అమన్జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీచరణి, రేణుకా
BAN: సుమియా, రుబ్యా హైదర్, షర్మిన్, శోభన, సుల్తానా(C), షోర్నా, మోని, రబేయా, నహిదా, నిషితా, మరుఫా
News October 26, 2025
JNTUలో 28, 29, 30న ఇంటర్వ్యూలు

అనంతపురం జేఎన్టీయూలో ఈ నెల 28, 29, 30న కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీంకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో 45 మంది బోధన సిబ్బంది పాల్గొననున్నారు. 28 మంది సీనియర్ ప్రొఫెసర్కు, 6 మంది ప్రొఫెసర్కు, 11 మంది అసోసియేట్ ప్రొఫెసర్ పదోన్నతులకు దరఖాస్తులు చేసుకున్నట్లు వివరించారు.


