News March 26, 2025
భీమవరం: ‘నేడు పదో తరగతి పరీక్షకు 517 డుమ్మా’

నేడు జిల్లాలో జరిగిన టెన్త్ భౌతిక శాస్త్ర పరీక్షకు 22,894 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 22,357మంది విద్యార్థులకు 517 గైర్హాజరయ్యారని డీఈవో నారాయణ తెలిపారు. ఓపెన్ స్కూల్ సైన్స్ , అండ్ టెక్నాలజీ పరీక్షకు 487 మంది విద్యార్థులకు గాను 379 విద్యార్థులు హాజరు కాగా 108 గైర్హాజరయ్యారని చెప్పారు.
Similar News
News April 1, 2025
ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి వర్మ చర్చలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయని కేంద్ర మంత్రి వర్మ అన్నారు. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోమవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చర్చలు జరిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి ప్యాకేజీని మంజూరు చేసిన తర్వాత తదనంతర పరిణామాలపైనా చర్చించారు.
News March 31, 2025
మహిళా ఖైదీ సూసైడ్.. ఇద్దరు సస్పెండ్

ఏలూరు జిల్లా జైల్లో నిన్న వాష్రూమ్లో జీలుగుమిల్లి(M) ఆకులగూడేనికి చెందిన మహిళా ఖైదీ శాంతకుమారి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె సూసైడ్పై విచారణ చేపట్టిన డీఎస్పీ శ్రావణ్కుమార్, ఆర్డీవో అంబరీష్ జైలును పరిశీలించారు. హెడ్వార్డర్ వరలక్ష్మి, వార్డర్ నాగమణిలు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడతోనే ఆమె సూసైడ్కు ఆస్కారం ఏర్పడిందనే ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేశారు.
News March 31, 2025
జీలుగుమిల్లి: అయ్యో పాపం.. ఆ చిన్నారుల పరిస్థితి ఏమిటి?

ఉమ్మడి ప.గో జిల్లా జీలుగుమిల్లి(M) తాటియాకులగూడెంలో ఇటీవల హత్యకు గురైన గంధం బోసు హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోసు భార్య శాంతకుమారి ఆదివారం జైల్లో ఉరివేసుకుని మృతిచెందారు. దీంతో వారి పిల్లలు చెర్రీ(8), ఆరాధ్య(7) అనాథలయ్యారు. ఇప్పుడు ఆ చిన్నారుల పరిస్థితి ఏమిటో తెలియట్లేదు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారుల పరిస్థితిని చూసిన స్థానికులు అయ్యో పాపం వీరికి ఎంత కష్టమొచ్చిందో అని అంటున్నారు.