News March 26, 2025

అనకాపల్లి: 208 మంది విద్యార్థులు గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన పదవ తరగతి ఫిజికల్ సైన్స్ పరీక్షకు 208 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది హాజరు కావాల్సి ఉండగా 20,673 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 766 మంది హాజరు కావలసి ఉండగా 659 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News September 15, 2025

మెదక్: అట్టహాసంగా ఉమ్మడి జిల్లా కరాటే పోటీలు

image

పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి 14 సంవత్సరాలులోపు బాలబాలికలకు
కరాటే పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల నుంచి 85 మంది బాలురు, 75 మంది బాలికలు మొత్తం 160 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఎస్.జి.ఎఫ్ కార్యదర్శి నాగరాజు, పీఈటీల సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు, శ్రీధర్ రెడ్డి, పీడీలు ప్రతాప్ సింగ్, మాధవా రెడ్డి, పూర్ణచందర్ ఉన్నారు.

News September 15, 2025

ప్రజావాణిలో 90 దరఖాస్తులు స్వీకరణ: కలెక్టర్

image

జనగామలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 90 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ప్రజా విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాని అన్నారు. ప్రజావాణితో ఎంతో మంది సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజావాణిలో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. అదనపు కలెక్టర్లు బెన్షా లోమ్, పింకేశ్ కుమార్ పాల్గొన్నారు.

News September 15, 2025

కేటీఆర్‌లా బెదిరింపు దావాలు వేయను: బండి

image

TG: KTR తనపై వేసిన <<17719172>>పరువునష్టం దావా<<>>పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటా. కేటీఆర్‌‌లా బెదిరింపుల కోసం దావాలు వేయను. దావా వేయాలనుకుంటే కేసీఆర్, కేటీఆర్ బయటికే రారు. మీరు తిట్టని తిట్లు లేవు. నేను లవంగం తింటే తంబాకు అన్నావ్. నన్ను వాడు, వీడు అన్నావ్. మీ అయ్య నా తల ఆరు ముక్కలు నరుకుతా అన్నాడు. వీటన్నింటిపై పరువు నష్టం దావా వేయరాదా?’ అని బండి ప్రశ్నించారు.