News March 26, 2025

ధర్మారం: మద్యానికి బానిసై యువకుడి సూసైడ్

image

మద్యానికి బానిసై యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ధర్మారం మండలం కొత్తూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన నవీన్ (29) మద్యానికి బాగా బానిసయ్యాడు. దీంతో అతడి భార్య తనను వదిలివెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెంది పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. మృతుడి తమ్ముడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Similar News

News April 1, 2025

అసదుద్దీన్‌తో సీఎం రేవంత్ ఇఫ్తార్ విందు

image

TG: హైదరాబాద్‌లో మైనారిటీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఆయనతోపాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా విందులో పాల్గొన్నారు. ‘రంజాన్ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దానధర్మాలు మానవాళికి ఆదర్శం’ అని సీఎం పేర్కొన్నారు.

News April 1, 2025

పన్నుల ద్వారా ఇప్పటివరకు రూ.80 కోట్లకు పైగా ఆదాయం: కమిషనర్

image

పన్ను ద్వారా బల్దియాకు సుమారు రూ.80 కోట్లకు పైగా ఆదాయం వసూలు చేసినట్లు బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. హన్మకొండ అశోక టాకీస్ వద్ద గల ఈ సేవా కేంద్రాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పన్ను వసూళ్ల తీరును పరిశీలించారు. రెగ్యులర్ పన్ను వసూళ్లతో పాటు ఆస్తి పన్నుపై 90% వడ్డీ మాఫీ పథకంను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సుమారు రూ.80 కోట్లకు పైగా వసూళ్లు జరిపామని అన్నారు.

News April 1, 2025

నొప్పి అంటే ఏంటో చూపిస్తా: హూతీలకు ట్రంప్ మాస్ వార్నింగ్

image

తమ దేశానికి చెందిన నౌకలపై దాడులు ఆపాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హూతీలను హెచ్చరించారు. లేదంటే మీతోపాటు ఇరాన్‌కు కూడా నొప్పి అంటే ఏంటో చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. తమ నౌకలపై దాడులు ఆపేవరకూ హూతీలపై దాడులు ఆపమని స్పష్టం చేశారు. ఇరాన్ కూడా హూతీలకు తక్షణమే మద్దతు ఆపాలన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీలు 300 సార్లకుపైగా USకు చెందిన నౌకలపై దాడులు చేశారు

error: Content is protected !!