News March 26, 2025

భద్రాచలం: ప్రమాదంలో.. ఇద్దరు మేస్త్రీలు, నలుగురు కూలీలు మృతి?

image

భద్రాచలంలో ఆరంతస్తుల భవనం కుప్పకూలగా, ఆరుగురు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇందులో భద్రాచలానికి చెందిన తాపీ మేస్త్రీలు ఉపేంద్ర, కామేష్‌లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మిగతా వారు అడ్డా కూలీలు కాగా, వారి వివరాలు తెలియాల్సి ఉంది. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Similar News

News December 28, 2025

శబరిమల మకరజ్యోతి దర్శనం ఎప్పుడు?

image

అయ్యప్ప స్వామి భక్తులు ఎంతగానో ఎదురుచూసే శబరిమల మకరజ్యోతి 2026లో జనవరి 14న కనిపించనుంది. ఆ రోజు సాయంత్రం 6:30 నుంచి 6:55 గంటల మధ్య పొన్నాంబలమేడు వద్ద దర్శనమిస్తుందని అంచనా. జ్యోతి దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దేవస్వం బోర్డు సూచించింది. జనవరి 19 రాత్రి వరకు దర్శనానికి అవకాశం ఉండగా 20వ తేదీన ఆలయం మూసివేయనున్నారు.

News December 28, 2025

ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గా సురేశ్ బాబు

image

ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో <<18695841>>ఫిల్మ్ ఛాంబర్ <<>>ప్రెసిడెంట్‌గా డి.సురేశ్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా నాగవంశీ, కార్యదర్శిగా అశోక్ కుమార్, కోశాధికారిగా దామోదరప్రసాద్‌ను ఎన్నుకున్నారు. మొత్తం 48 మంది కార్యవర్గంలో 31 మంది ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు, 17 మంది మన ప్యానెల్‌ మెంబర్స్ విజయం సాధించారు. 2027 వరకు సురేశ్ బాబు ప్రెసిడెంట్‌గా ఉండనున్నారు.

News December 28, 2025

MHBD: చదువులమ్మ ఒడిలో అ‘పూర్వం’.. @46

image

మహబూబాబాద్ జిల్లా పెద్దముప్పారం ZPHSలో 1979 బ్యాచ్‌కు చెందిన ఏడో తరగతి విద్యార్థులు 46 ఏళ్ల తర్వాత ఆదివారం తిరిగి కలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు బాబురావు, గోపిరెడ్డి, సోమిరెడ్డి, సోమయ్యలను ఘనంగా సన్మానించారు. అలాగే మరణించిన స్నేహితులకు శ్రద్ధాంజలి ఘటించారు.