News March 26, 2025

బాపట్ల జిల్లాలో యువ రైతు ఆత్మహత్య

image

బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని కొమ్మినేనివారిపాలెంలో అప్పులు బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువ రైతు బ్రహ్మయ్య వ్యవసాయంలో భారీగా అప్పులు కావడంతో, గ్రామంలోని పంట పొలాల్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడికి చేరుకొని ఉదయాన్నే పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి వైద్యశాలకు తరలించారు.

Similar News

News February 18, 2026

ఈసారైనా గందరగోళం లేకుండా సాగుతాయా?

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నేటి నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గత నవంబర్‌లో పీజీ పరీక్షలలో ప్రశ్నాపత్రాల్లో తప్పులు, నిర్వహణలో లోపాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈసారి సెమిస్టర్ పరీక్షలైనా సమర్థవంతంగా నిర్వహిస్తారా? అన్న సందేహం విద్యార్థుల్లో నెలకొంది. అధికారులు ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

News February 18, 2026

ములుగు జిల్లాలో అలజడి.. అడవుల్లో జల్లెడ!

image

ములుగు జిల్లాలో వారం రోజులుగా పోలీసు బలగాలు విస్తృతంగా జల్లెడ పడుతున్నాయి. గుత్తికోయ గూడాలు, మారుమూల పల్లెల్లో ఆరా తీస్తూ అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టులు ప్రవేశించారనే సమాచారంతో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లాలో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ ఉన్నాడనే గుసగుసల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

News February 18, 2026

పోచంపల్లి: ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య

image

మద్యపానం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. పోచంపల్లి మండలం జూలూరులో పద్మ అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఆంజనేయులు మద్యం తాగి రావడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపంతో గురైన పద్మ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వీరికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.