News March 26, 2025

ఉప్పల్‌లో IPL మ్యాచ్‌లు.. TGSRTC స్పెషల్ బస్సులు

image

TG: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు వెళ్లే అభిమానులకు TGSRTC శుభవార్త చెప్పింది. GHMC పరిధిలోని 24 డిపోల నుంచి స్టేడియానికి 60 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. మార్చి 27, ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21 తేదీల్లో ఉప్పల్‌లో మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే.

Similar News

News April 1, 2025

వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

image

AP: వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉ.5.30 గంటలకే బ్రేక్ దర్శనాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. మరోవైపు వేసవిలో రద్దీని దృష్టిలో పెట్టుకొని సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని తెలుస్తోంది. అటు వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్‌లైన్‌లో శ్రీవారి దర్శన టోకెన్లు ఇవ్వాలని తీర్మానం చేసింది.

News April 1, 2025

NSE విలువ రూ.410 లక్షల కోట్లు

image

NSE (నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్) లోని 2,710 కంపెనీల మార్కెట్ విలువ రూ.410.87 లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది మార్చి 31 నాటికి ఎన్ఎస్ఈ విలువ రూ.384.2 లక్షల కోట్లుగా ఉంది. అలాగే గత నెల 28నాటికి NSEలో ఇన్వెస్టర్ల సంఖ్య 11.3 కోట్లుగా ఉంది. వీరిలో ఏపీ నుంచి 51 లక్షలు, టీజీ నుంచి 27 లక్షల మంది ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి 3 సంస్థలు ఐపీఓలకు వచ్చి రూ.6,283 కోట్లు సమీకరించాయి.

News April 1, 2025

‘కోర్ట్’ మూవీ అరుదైన రికార్డ్

image

హీరో నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీ అరుదైన రికార్డు సృష్టించింది. ఈ ఏడాది విడుదలైన IND చిత్రాల్లో బుక్‌మై షో పబ్లిక్ రేటింగ్ 9.5 సాధించిన మూవీగా నిలిచింది. రూ.10 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ.56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అలాగే USలో మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియదర్శిని, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు.

error: Content is protected !!