News March 27, 2025
యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన బుకింగ్ రూ.1,01,350, VIP దర్శనాలు రూ.75,000, బ్రేక్ దర్శనాలు రూ.1,05,000, ప్రసాద విక్రయాలు రూ.7,30,470, కళ్యాణకట్ట రూ.64,000, సువర్ణ పుష్పార్చన రూ.38,632, కార్ పార్కింగ్ రూ.2,19,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.27,24,822 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.
Similar News
News December 28, 2025
నా ప్రాణానికి ముప్పు: MLC దువ్వాడ

AP: తన ప్రాణానికి <<18684111>>ముప్పు<<>> ఉందని MLC దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. తనకు ఏమైనా జరిగితే దానికి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదే కారణమని ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాకుళం SPని కలిసి ఫిర్యాదు చేశారు. 2+2 గన్మెన్లను కేటాయించాలని కోరారు. కొద్ది రోజులుగా తనకు ఫోన్లో, ప్రత్యక్షంగా బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే వారిని అణచివేయాలనే ధోరణి సరికాదని మీడియాతో అన్నారు.
News December 28, 2025
గద్వాల: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అర్హులైన విద్యార్థులు వచ్చే ఏడాది జనవరి 21 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో గురుకుల అధికారులు పాల్గొన్నారు.
News December 28, 2025
సహకారం అందిస్తాం.. అభివృద్ధి చేయండి : ఆది శ్రీనివాస్

పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని సర్పంచులను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో సన్మానించి అభినందించారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వం తరఫున గ్రామ సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.


