News March 27, 2025

ఏప్రిల్ 6న భద్రాచలానికి రావాలని సీఎంకు ఆహ్వానం

image

భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏప్రిల్ 6న గిరిజన మ్యూజియం ప్రారంభం కానుండగా, ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా రావాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రాచల ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఐటీడీఏ పీవో రాహుల్, ఏపీవో డేవిడ్ రాజు ఆహ్వాన పత్రిక అందజేసి స్వాగతించారు. సీఎం సానుకూలంగా స్పందించారు.

Similar News

News September 17, 2025

దేశవ్యాప్తంగా 16చోట్ల NIA సోదాలు

image

AP: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో NIA మరోసారి తనిఖీలు చేపట్టింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, UP, ఝార్ఖండ్, బిహార్, ఢిల్లీ, మహారాష్ట్రలో మొత్తం 16చోట్ల సోదాలు చేసింది. ఏపీలో నిర్వహించిన సోదాల్లో డిజిటల్ పరికరాలు, నగదు, అనుమానాస్పద వస్తువులు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. జులై నెల VZMలో సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను NIA అరెస్టు చేయగా.. కేంద్రానికి వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.

News September 17, 2025

ASF: యువకుడి ఆత్మహత్య

image

అప్పుల బాధ భరించలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపిన వివరాలు.. ASF మండలం అంకుశాపూర్ కి చెందిన సుభాశ్ (32) అప్పుల బాధతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి జానకాపూర్ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News September 17, 2025

కలకడ: హత్యాయత్నం కేసులో నిందితులు అరెస్టు

image

హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కలకడ SI రామాంజనేయులు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 10న ముడియంవారిపల్లె, కొత్తపల్లెకు చెందిన ప్రవీణ్, అతని తండ్రి వెంకటరమణ, తల్లి సుబ్బమ్మపై ముడియంవారిపల్లి ప్రసాద్‌రెడ్డి, గంగిరెడ్డి, పుస్పావతి, శ్రీనివాసులురెడ్డి అతని అనుచరులు కొడవలితో నరికి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఈ కేసులో నలుగురితో పాటు మైనర్లను అరెస్టు చేశామని తెలిపారు.