News March 27, 2025
కృష్ణాజిల్లాలో వివిధ రాష్ట్రాల యువకుల శ్రమదానం

కేరళలోని బైబిల్ కళాశాల యువకులు బుధవారం కృష్ణాజిల్లాలోని చల్లపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మిజోరం రాష్ట్రం యువకుడు చోచో, తమిళనాడు యువకులు శివబాలన్, అడ్రెల్లా, కాకినాడ యువకుడు శామ్యూల్ గ్రామాన్ని సందర్శించారు. చల్లపల్లి పాస్టర్ దైవసేకుడు గోల్కొండ డేవిడ్ సూచన మేరకు గ్రామంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన రహదారుల పక్కన పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేశారు.
Similar News
News April 1, 2025
కృష్ణా: ఏప్రిల్ ఫూల్ చేశారా ఎవరినైనా.?

ఏప్రిల్ 1 వచ్చిందంటే పిచ్చి పనుల పండగే. ఒకరిని ఒకరు వంచించి, లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పుకుంటూ నవ్వుల జల్లు కురిపించేవారు. 2010-12 వరకు ఏప్రిల్ ఫూల్ హంగామా రచ్చరచ్చగా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లోనే మెసేజ్లతో సరిపెట్టుకుంటున్నారు. మీకు ఎప్పుడైనా షాకింగ్ ఏప్రిల్ ఫూల్ అనుభవం వచ్చిందా.? కామెంట్ చేయండి..
News April 1, 2025
ప్రవీణ్ పగడాల మృతి కేసు.. ఎస్పీ తీవ్ర హెచ్చరికలు

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా SP గంగాధరరావు ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రవీణ్ పగడాల మృతి కేసును పోలీస్ శాఖ అత్యంత పారదర్శకంగా దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎవరైనా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసినా, ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించేలా వ్యాఖ్యలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
News April 1, 2025
కృష్ణా: చిన్నారి మృతి.. హృదయవిదారకం

కృష్ణా (D) అవనిగడ్డ(M) పులిగడ్డలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి వాసులు నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో 2 నెలల శిశువు కూడా ఉంది. ఆ చిన్నారికి నామకరణం చేసేందుకు మోపిదేవి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్ని తరలిస్తుండగా కారు వెనుక సీటులో పసికందు పోలీసులకు కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా పాపను బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.