News March 27, 2025

ఏషియన్ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు మరో పతకం

image

జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జరుగుతోన్న సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్-2025లో భారత్‌కు మరో మెడల్ దక్కింది. 97 కేజీల విభాగంలో రెజ్లర్ నితేశ్ కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో భారత్ పతకాల సంఖ్య 2కు చేరింది. నిన్న 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ బ్రాంజ్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే. నితేశ్ గతంలో U23 ఏషియన్ ఛాంపియన్‌షిప్స్, U23 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ పతకాలు సాధించారు.

Similar News

News April 1, 2025

మహిళపై గ్యాంగ్ రేప్.. సంచలన విషయాలు

image

TG: నాగర్ కర్నూల్ జిల్లాలో <<15944914>>మహిళపై గ్యాంగ్ రేప్<<>> ఘటనలో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఏడుగురు ఈ దారుణానికి ఒడిగట్టగా, దాదాపు 3 గంటలపాటు ఆమెను లైంగికంగా వేధించినట్లు చెప్పారు. దాహం వేస్తోందని బాధితురాలు మంచినీరు అడగగా మానవత్వం మరిచి నోట్లో మూత్రం పోసినట్లు తెలిపారు. కాగా నిన్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వీరికి సహకరించిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

News April 1, 2025

స్టాక్ మార్కెట్స్ క్రాష్

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎరుపెక్కాయి. కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌ ఆరంభంలోనే బేర్ పంజా విసిరింది. సెన్సెక్స్ 1160 పాయింట్ల భారీ నష్టంతో 76,220 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 273Pts కోల్పోయి 23,246 వద్ద కొనసాగుతోంది. Bajaj finserv, infosys, HDFC బ్యాంక్, Sriram, Bajaj finance షేర్లు భారీగా పడిపోయాయి.

News April 1, 2025

మా పాఠశాలల్లో తెలుగు, తమిళం బోధిస్తున్నాం: UP CM యోగి

image

త్రిభాషా విధానంలో భాగంగా తమ రాష్ట్రంలోని స్కూళ్లలో తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ తదితర భాషలు బోధిస్తున్నట్లు UP CM యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. దీనివల్ల తమ స్టేట్ ఏమైనా చిన్నదైపోతుందా? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. త్రిభాషా విధానం వల్ల కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించగలుగుతున్నట్లు చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే TN CM స్టాలిన్ ఈ విధానంపై వివాదాలు రాజేస్తున్నారని యోగి మండిపడ్డారు.

error: Content is protected !!