News March 27, 2025

రామగుండం: ఒకేసారి ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందండి: అదనపు కలెక్టర్

image

ఈనెల 31 లోగా బకాయిలతో సహా ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లిస్తే 90% వడ్డీ మినహాయింపు పొందే అవకాశం ఉందని జిల్లా అదనపు కలెక్టర్& రామగుండం కార్పొరేషన్ కమిషనర్ అరుణ శ్రీ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మార్చి 31(2025) నాటికి ఉన్న ఆస్తి పన్ను బకాయిలు అన్నింటినీ ఒకేసారి చెల్లిస్తే రాయితీ పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News November 10, 2025

NZB: 3.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

image

జిల్లాలో ఇప్పటికే దాదాపు 50% మేర 3.47 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ పూర్తి చేయడంతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో సేకరించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు.

News November 10, 2025

అనకాపల్లి ఎస్పీ ఆఫీసుకి 50 ఫిర్యాదులు

image

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల వేదికలో మొత్తం 50 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూ తగాదాలు 19, కుటుంబ కలహాలు 2, మోసం 2, ఇతర విభాగాలకు చెందినవి 27గా గుర్తించారు. ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి, 7 రోజుల్లో విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని తెలిపారు.

News November 10, 2025

JE, SI పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన SSC

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) జూనియర్ ఇంజినీర్, SI పోస్టుల పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్స్ డిసెంబర్ 3 నుంచి 6 వరకు, ఎస్సై పోస్టులకు డిసెంబర్ 9 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. JE సెల్ఫ్ స్లాట్ సెలక్షన్ నవంబర్ 10 నుంచి 13వరకు, ఎస్సై పోస్టులకు NOV 17 నుంచి 21వరకు ఎంపిక చేసుకోవచ్చు. SI పోస్టులు 3,073 ఉండగా, జూనియర్ ఇంజినీర్ పోస్టులు 1731 ఉన్నాయి.