News March 27, 2025

TGలో ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీ.. ఎక్కడంటే?

image

TG: రాష్ట్రంలో కొత్తగా ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగూడెంలోని మైనింగ్ కాలేజీని ఎర్త్‌సైన్స్ వర్సిటీగా అప్‌గ్రేడ్ చేయనుంది. వారం రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు విడుదల కానున్నాయి. వర్సిటీ ఏర్పాటుకు రూ.500 కోట్ల నిధులతో పాటు 100 పోస్టులు అవసరమని ఉన్నత విద్యామండలి అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

Similar News

News April 1, 2025

రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో కీలక పరిణామం

image

AP: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి గుంటూరు GGH సూపరింటెండెంట్ ప్రభావతి తప్పకుండా దర్యాప్తునకు సహకరించాలని సుప్రీం ఆదేశించింది. ఈ నెల 7, 8వ తేదీల్లో సంబంధిత PSలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సాకులు చూపుతూ ప్రభావతి దర్యాప్తునకు రావట్లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించగా.. 2 నెలల్లో ఒక్కసారే పిలిచారని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

News April 1, 2025

విద్యార్థినులను దుర్భాషలాడిన ప్రిన్సిపల్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

image

TG: వికారాబాద్‌లో ఓ ప్రిన్సిపల్ గురుకుల విద్యార్థినులను అసభ్య పదజాలం వాడుతూ కొట్టడంపై <>BRS నేత ప్రవీణ్ కుమార్<<>> తీవ్రంగా స్పందించారు. ‘గురుకులాల్లో పిల్లలను ఇలాగే పెంచుతారా?. విద్యార్థినులను లేకి ము**, దొంగ ము** అని తిడతారా? మీ పిల్లలను ఇలాగే దండిస్తారా?’ అని నిలదీశారు. పిల్లలు తప్పు చేస్తే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ను కోరారు.

News April 1, 2025

మహిళపై గ్యాంగ్ రేప్.. సంచలన విషయాలు

image

TG: నాగర్ కర్నూల్ జిల్లాలో <<15944914>>మహిళపై గ్యాంగ్ రేప్<<>> ఘటనలో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఏడుగురు ఈ దారుణానికి ఒడిగట్టగా, దాదాపు 3 గంటలపాటు ఆమెను లైంగికంగా వేధించినట్లు చెప్పారు. దాహం వేస్తోందని బాధితురాలు మంచినీరు అడగగా మానవత్వం మరిచి నోట్లో మూత్రం పోసినట్లు తెలిపారు. కాగా నిన్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వీరికి సహకరించిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

error: Content is protected !!