News March 27, 2025

అమరావతి: రాజధాని ప్రాంతంలో ఊపందుకున్న రియల్ ఎస్టేట్

image

అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. గత ప్రభుత్వం హయాంలో గజం రూ. 25 నుంచి రూ. 30 వేల వరకు పలికిన ధర నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పనులు ప్రారంభం కావడంతో గజం రూ. 60 నుంచి రూ. 70 వేల వరకు పలుకుతుంది. ఎక్కువగా ప్లాట్లు కొనుగోలు చేసేవారు కోర్ క్యాపిటల్ ఏరియాలో కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని అదునుగా చూసుకొని రియల్టర్లు అవకాశంగా మలచుకుంటున్నారు.

Similar News

News January 3, 2026

ANUలో విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహించిన ఈ డ్రైవ్‌లో భాగంగా ప్రీ ప్లేస్మెంట్, అసెస్మెంట్‌లో 150 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డా.ఎండీ తౌసిఫ్ అహ్మద్ తెలిపారు. క్వాలిఫై అయిన విద్యార్థులకు శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News January 2, 2026

విజయవాడలో నేటి నుంచి బుక్ ఫెస్టివల్

image

విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జనవరి 2 నుంచి 12 వరకు 35వ పుస్తక ప్రదర్శన జరగనుంది. నేడు ప్రముఖుల సమక్షంలో ప్రారంభం కానున్న ఈ ప్రదర్శనలో 280కి పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. గత 25 ఏళ్లలో కథ, నవల, కవిత, నాటక రంగాల్లో వచ్చిన మార్పులపై ప్రముఖులు చర్చా వేదికల్లో ప్రసంగించనున్నారు. యువ రచయితల పుస్తకాలు ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

News January 2, 2026

రాజ ముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ: కలెక్టర్

image

రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ కార్యక్రమం జనవరి 9వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారని చెప్పారు. జిల్లాలో మొత్తం 35,690 పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు.