News March 27, 2025
నకిరేకల్: ఎగ్జామ్స్ రాసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్

తన <<15867903>>డిబార్ను రద్దు<<>> చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని శాలిగౌరారానికి చెందిన ఝాన్సీలక్ష్మి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ, NLG DEO, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, నకిరేకల్ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ను ప్రతివాదులుగా పేర్కొన్నారని విద్యార్థిని పేరెంట్స్ తెలిపారు. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News November 5, 2025
సంగారెడ్డి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

నిరుద్యోగ గ్రామీణ యువతకు టూవీలర్ మెకానిక్ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం(RSETI) డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉండి వయస్సు 19- 40 మధ్య ఉండాలి. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన వారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు బైపాస్ రహదారిలోని కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 5, 2025
BELలో 47 పోస్టులు.. అప్లైకి కొన్ని గంటలే ఛాన్స్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(B<
News November 5, 2025
’14 వరకు పశువులకు టీకా కార్యక్రమం పూర్తి చేయాలి’

సూర్యాపేట జిల్లాలో ఉన్న 2.69 లక్షల పశువులకు ఈనెల 14వ తేదీలోపు టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పశువైద్య శాఖ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ కే. అనిల్ కుమార్ ఆదేశించారు. బుధవారం కోదాడ ప్రభుత్వ ప్రాంతీయ పశువైద్యశాలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. కోదాడలో ఇప్పటికే 3,300 పశువులకు టీకాలు వేయడం అభినందనీయమన్నారు.


