News March 25, 2024
సంతనూతలపాడు: ఐదుగురు వాలంటీర్లు రాజీనామా

సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరుగు నాగార్జునకు మద్దతుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు వాలంటీర్లు ఆదివారం తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన కూడదనే ఎన్నికల కమిషన్ చెప్పడంతో వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొనడానికి తాము రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే తమ రాజీనామాలను ఎంపీడీవోకు అందజేయకుండా నాగార్జునకు అందజేయడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేశారు.
Similar News
News January 2, 2026
పొదిలి: తల్లిదండ్రులు తిట్టారని..!

పొదిలి మండలం జాఫ్లాపురంలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు(5వ తరగతి) స్కూల్కు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో నిన్న పొదిలి లక్ష్మీనరసింహ స్వామి కొండకు వెళ్లారు. ఏదైనా పని చేస్తామని భోజనం పెట్టాలని కోరారు. రాత్రి అక్కడే నిద్రించిన పిల్లలు ఉదయాన్నే ఆవులను మేతకు తీసుకెళ్లారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఇవాళ ఇంటికి తీసుకొచ్చారు.
News January 2, 2026
మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. మార్కాపురానికి చెందిన షేక్ కరీముల్లా(50), మాచర్లకు చెందిన నూర్జహాన్(45) బంధువులు. ఇద్దరూ ఫ్రూట్స్ బిజినెస్ చేస్తుంటారు. మాచర్ల నుంచి మార్కాపురానికి బైకుపై గురువారం బయల్దేరారు. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన మహేశ్ బైకుపై మాచర్లకు పయనమయ్యాడు. శిరిగిరిపాడు వద్ద ఈ రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కరీముల్లా, నూర్జహాన్ చనిపోగా మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు.
News January 1, 2026
మార్కాపురానికి CM రాక?

మార్కాపురం జిల్లాలో జనవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు రానున్నట్లు సమాచారం. వెలుగొండ ప్రాజెక్ట్ సందర్శన, ఫీడర్ కెనాల్ పనులను ప్రారంభించడానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మార్కాపురం జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రత్యేకతను సంతరించుకోనుందని చెప్పవచ్చు. కాగా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


