News March 27, 2025
మాచర్ల: రోడ్డు ప్రమాదంలో మరో యువకుడి మృతి

మాచర్లలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన మరో యువకుడు ప్రాణాలు విడిచాడు. అర్ధవీడు(M)నారాయణపల్లికి చెందిన ఆర్మీ జవాన్ ఇంద్రసేనారెడ్డి(27), మార్కాపురం(M) మిట్టమీదపల్లికి చెందిన కాశిరెడ్డి(29) నాగార్జునసాగర్లోని బంధువుల ఇంటికి బైక్పై వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా మాచర్ల(M) కొత్తపల్లి జంక్షన్ వద్ద DCM వీరిని ఢీకొట్టింది.
Similar News
News November 5, 2025
కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుతారు?

పరమేశ్వరుడి కీర్తిని విని ద్వేషంతో రగిలిపోయిన త్రిపురాసురుడు కైలాసంపైకి దండయాత్రకు వెళ్లాడు. మూడ్రోజుల భీకర పోరాటం తర్వాత ఈశ్వరుడు ఆ అసురుడిని సంహరించాడు. దీంతో వేయి సంవత్సరాల పాటు సాగిన అసుర పాలన అంతమైంది. దేవతల భయం కూడా తొలగిపోయింది. దీంతో అభయంకరుడైన శివుడు ఆనందోత్సాహాలతో తాండవం చేశాడు. ఈ ఘట్టం జరిగింది కార్తీక పౌర్ణమి నాడే కాబట్టి.. ప్రతి సంవత్సరం ఈ శుభదినాన శివుడిని అత్యంత భక్తితో పూజిస్తాము.
News November 5, 2025
ఫుట్బాల్కు వీడ్కోలు పలుకుతా: రొనాల్డో

త్వరలోనే తాను రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు పోర్చుగల్ ఫుట్బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఇది నిజంగానే కష్టంగా ఉంటుంది. నేను కచ్చితంగా ఏడ్చేస్తాను. 25 ఏళ్ల వయసు నుంచే నేను నా ఫ్యూచర్ ప్లాన్ రెడీ చేసుకున్నాను. నాకు వేరే ప్యాషన్స్ ఉన్నాయి. కాబట్టి పెద్దగా బోర్ కొట్టకపోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత నా కోసం, నా పిల్లల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను’ అని తెలిపారు.
News November 5, 2025
రామన్నపేట: కుటుంబానికి కష్టం.. ఊరంతా కదిలింది

సిరిపురం వాసి శ్రీనివాస్ ఇటీవలే అకస్మాత్తుగా మరణించాడు. ‘చేయిచేయి కలుపుదాం శ్రీనివాస్ కుటుంబానికి భరోసానిద్దాం’ అని గ్రామస్థులు ముందుకొచ్చి రూ.94,317 ఆయన కుటుంబానికి అందజేశారు. భార్య, పిల్లలకు ధైర్యం చెప్పారు. అండగా నిలిచిన వారికి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీనర్సు, రమేష్, శ్రీనివాస్, చక్రపాణి, శేఖర్, భద్రాచలం, కనకరత్నం, వెంకటయ్య, రాజు, యాదగిరి, రామకృష్ణ, యాదగిరి, శివ కుమార్ ఉన్నారు.


