News March 27, 2025
సూర్యాపేట: చెరువులో మునిగి వ్యక్తి మృతి

చెరువులో మునిగి వ్యక్తి మృతిచెందిన ఘటన చివ్వెంల మండలం తుల్జారావుపేటలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి సీతారాం గేదెలను చెరువు దగ్గరికి తోలుకెళ్లాడు. వాటిని బయటకు పంపే క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేశ్వర్ తెలిపారు.
Similar News
News November 15, 2025
ఖమ్మం: అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం నగరం వైరారోడ్ లోని ఎస్.ఆర్ గార్డెన్స్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. అవగాహనతో డయాబెటిస్ను తగ్గించుకోవచ్చని చెప్పారు. మధుమేహంపై నిర్లక్ష్యం వహిస్తే ఇది శరీరంలోని అన్ని అవయవాలను దెబ్బ తీస్తుందన్నారు.
News November 15, 2025
ఢిల్లీ పేలుళ్ల ఘటన… అల్ ఫలాహ్ వర్సిటీపై కేసులు

ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనలో ఢిల్లీ పోలీసులు హరియాణా అల్ ఫలాహ్ వర్సిటీపై 2 కేసులు నమోదు చేశారు. UGC, NAACలు వర్సిటీ అక్రమాలను గుర్తించిన తదుపరి మోసం, ఫోర్జరీ, తప్పుడు అక్రిడిటేషన్లపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా పేలుళ్లకు నేరపూరిత కుట్రకు సంబంధించి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ వర్సిటీపై ఇంతకు ముందు ఒక కేసును నమోదు చేశారు. పేలుళ్ల నిందితుల వివరాలు సేకరించి విచారిస్తున్నారు.
News November 15, 2025
‘స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలి’

బాపట్ల జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించి, చెక్ లిస్ట్ ఆధారంగా కార్యక్రమాలు జరగాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచి మొక్కలు నాటాలన్నారు. ఆధార్ నవీకరణ, సచివాలయ భవనాల పనులు త్వరగా పూర్తిచేయాలని పేర్కొన్నారు.


