News March 27, 2025

కామారెడ్డి: చెరువులో నీట మునిగి బాలుడు మృతి

image

HYD గచ్చిబౌలి పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలానికి చెందిన కార్తీక్ (14) చెరువులో నీట మునిగి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కుర్ల గ్రామానికి చెందిన మల్కయ్య-బాలమణి దంపతులు నానక్‌రాంగూడలో పనిచేస్తున్నారు. కాగా కొడుకు కార్తీక్ సోమవారం కనిపించకుండా పోయాడు. మంగళవారం తల్లిదండ్రులు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా బుధవారం విప్రో లేక్‌లో శవమై తేలాడు.

Similar News

News July 6, 2025

జగిత్యాల: మిస్టరీగా 5 ఏళ్ల చిన్నారి మృతి!

image

కోరుట్లలోని <<16959055>>5 ఏళ్ల చిన్నారి మృతి <<>>కేసు మిస్టరీగా మారింది. అభం శుభం తెలియని బాలిక హితీక్ష ప్రమాదవశాత్తు మరణించిందా లేదా హత్య చేశారా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. అయితే నిన్న సాయంత్రం పెద్దపులుల విన్యాసాలు చూసేందుకు మిత్రులతో కలిసి వెళ్లిన చిన్నారి భయంతో బాత్రూంలో దాక్కోగా కాలుజారి అక్కడే ఉన్న నల్లాపై పడి చనిపోయిందనే అనుమానమూ వ్యక్తమవుతోంది. బాలిక తండ్రి రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటున్నారు.

News July 6, 2025

వత్సవాయిలో ప్రమాదం.. ఒకరి మృతి

image

వత్సవాయి నుంచి వైరా వెళ్లే రహదారిలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో తాళ్లూరు వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, పెనుగొండ బాల, రాయల రాంబాబు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 6, 2025

4 బంతుల్లో 3 వికెట్లు

image

మేజర్ లీగ్‌ క్రికెట్‌లో ఆడమ్ మిల్నే అదరగొట్టారు. సియాటెల్ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి టెక్సాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. 19వ ఓవర్‌లో తొలి 2 బంతులకు 2 వికెట్లు పడగొట్టిన అతడు 4వ బంతికి మరో వికెట్ తీసి సియాటెల్‌ను ఆలౌట్ చేశారు. దీంతో మొత్తం ఆ ఓవర్‌లో 4 బంతుల్లోనే 3 వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టెక్సాస్ 188 రన్స్ చేయగా ఛేజింగ్‌లో సియాటెల్ 137 పరుగులకే కుప్పకూలింది.