News March 27, 2025

పామ్ ఆయిల్ రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి MP వినతి

image

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు పామాయిల్ తోటల సాగుకు అనువైనవని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ జిల్లాల్లో పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. నాసిరకమైన విత్తనాలు, నర్సరీల్లో అవినీతి, అధికారుల నుంచి సరైన అవగాహన సదస్సులు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు.

Similar News

News November 12, 2025

రంగారెడ్డి: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 13న ఇంటర్వ్యూ

image

నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్‌లో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా DMHO లలితాదేవి తెలిపారు. రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఈనెల 13న ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని, MBBS పూర్తి చేసిన వారు దరఖాస్తు ఫారంతో పాటు బయోడేటా, జిరాక్స్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్లు తీసుకురావాలన్నారు.

News November 12, 2025

రంగారెడ్డి: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 13న ఇంటర్వ్యూ

image

నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్‌లో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా DMHO లలితాదేవి తెలిపారు. రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఈనెల 13న ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని, MBBS పూర్తి చేసిన వారు దరఖాస్తు ఫారంతో పాటు బయోడేటా, జిరాక్స్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్లు తీసుకురావాలన్నారు.

News November 12, 2025

HYD: శ్రీధర్‌రావు ఆక్రమణలను తప్పుబట్టిన హైకోర్టు

image

గచ్చిబౌలిలోని FCI ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆక్రమణలను హైకోర్టు తప్పు పట్టింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణించింది. మెజార్టీ ప్లాట్లు తనవే అనే ఉద్దేశంతో ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. అందుకే హైడ్రా ఆ ఆక్రమణలను తొలగించిందని పేర్కొంది.