News March 27, 2025
మొగల్తూరుపై పవన్ ఫోకస్.. కారణం ఇదే!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి స్వగ్రామం మొగల్తూరు. తండ్రిది పెనుగొండ. దీంతో ఈ రెండు గ్రామాలపై డిప్యూటీ సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ రెండు చోట్ల సమస్యలు తెలుసుకోవడానికి శుక్రవారం ప్రత్యేక మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఏకంగా పవన్ పేషీకి సంబంధించిన అధికారులు ఈ రెండు గ్రామాలకు వస్తారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను గుర్తించి పవన్కు వివరించనున్నారు. ఆ తర్వాత అభివృద్ధి పనులు చేపడతారు.
Similar News
News April 1, 2025
ప.గో: రెండు రోజుల్లో 10 టన్నుల చికెన్ అమ్మకాలు

ప.గో జిల్లా వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినేవాళ్లు తగ్గడంతో ధర అమాంతంగా రూ.200 దిగువకు పడిపోయింది. అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రభావం లేకపోవడంతో కొనుగోళ్లు పెరగడం, సరఫరా తగ్గడంతో కేజీ రూ.300కు పెరిగింది. ఉగాది, రంజాన్ పండుగ రోజుల్లో జిల్లాలో 10 టన్నులకు పైగా చికెన్ కొనుగోలు చేసినట్లు వ్యాపారస్తులు తెలుపుతున్నారు.
News April 1, 2025
తాడేపల్లిగూడెంలో ఫోక్సో కేసు నమోదు

తాడేపల్లిగూడెంలోని కడగట్లకు చెందిన నాగరాజుపై టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు సోమవారం నమోదయింది. సీఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. 2 రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి యత్నిస్తుండగా మేనమామ చూసి కేకలు వేగా నాగరాజు పరారయ్యాడన్నారు. మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News April 1, 2025
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతాం: SP

పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతికి సంబంధించి తప్పుడు వదంతులు, అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని SP అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. కుల, మత, రాజకీయ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.