News March 27, 2025

ఆ గాయం మానేందుకు 9 నెలలు: రష్మిక

image

తన కాలి గాయం మానేందుకు 9 నెలల సమయం పడుతుందని హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. సోషల్ మీడియలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం కొంత కోలుకున్నానని, నడవగలుగుతున్నానని చెప్పారు. అలాగే తనకు ఎత్తైన ప్రదేశాలు, నీటి లోతు ఎక్కువగా ఉండే ప్రదేశాలంటే చాలా భయమని పేర్కొన్నారు. కాగా జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. గాయంతోనే ‘ఛావా’ ప్రమోషన్లకు హాజరయ్యారు.

Similar News

News April 1, 2025

తెలంగాణ కాంగ్రెస్ ఫ్లెక్సీలో YS జగన్ ఫొటో

image

TG: నల్గొండలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోను ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. సన్నబియ్యం పంపిణీకి వస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్వాగతం పలుకుతూ దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

News April 1, 2025

లోక్‌సభ ఎంపీలకు విప్ జారీ

image

రేపు లోక్‌సభ సమావేశానికి అందరూ హాజరుకావాలని తమ MPలకు బీజేపీ, కాంగ్రెస్ అధిష్ఠానాలు విప్ జారీ చేశాయి. లోక్‌సభలో కేంద్రం రేపు వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఎంపీలందరూ కచ్చితంగా రావాలని బీజేపీ అధిష్ఠానం చెప్పినట్లు సమాచారం. అటు కాంగ్రెస్ కూడా బిల్లుపై తీవ్ర నిరసనలు తెలిపే అవకాశం ఉంది.

News April 1, 2025

వడగాలులు, పిడుగులతో వర్షాలు.. రేపు జాగ్రత్త

image

AP: రాష్ట్రంలో రేపు 30, ఎల్లుండి 47 మండలాల్లో <>వడగాలులు ప్రభావం చూపే<<>> అవకాశం ఉన్నట్లు APSDMA వెల్లడించింది. రేపు శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో, గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని పేర్కొంది. రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

error: Content is protected !!