News March 27, 2025
SRD: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం MDK, SRD, SDPT డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు.జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
Similar News
News April 1, 2025
కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసిన కేంద్రమంత్రి సంజయ్

కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు కేంద్రమంత్రి సంజయ్ వినతి పత్రం అందించారు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా కరీంనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో 8-సింథటిక్ ట్రాక్, ఫ్లడ్ లైట్లు, ఓపెన్ గ్యాలరీలో క్రీడాకారులు, ప్రేక్షకుల కోసం కెనోపీ, రక్షణ కవచం ఏర్పాటు చేయాలని కోరారు.
News April 1, 2025
నాగర్కర్నూల్: కల్వకుర్తిలో విషాదం

కల్వకుర్తి పట్టణానికి చెందిన వీరెడ్డి మధుసూదన్ రెడ్డి కుమారుడు వీరెడ్డి ఆనంద రెడ్డి (32) బ్రెయిన్ స్ట్రోక్తో మంగళవారం ఉదయం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉగాది పండుగ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన ఆయన అకస్మాత్తుగా వాంతులు చేసుకోవడంతో హుటాహుటిన HYDలోని ఆస్పత్రికి తరలించారు. 2 రోజులపాటు చికిత్స పొందిన ఆయన ఈరోజు ఉదయం మృతిచెందాడు. పెళ్లి వార్షికోత్సవం రోజే మరణించడం మరింత బాధాకరం.
News April 1, 2025
‘L2: ఎంపురాన్’ సినిమాలో మార్పులు

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’ సినిమా రివైజ్డ్ వెర్షన్కు సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు 24 కట్స్ సూచించడంతో 2:08min నిడివి తగ్గనుంది. అలాగే సినిమాలో విలన్ పేరును కూడా మార్చారు. రేపటి నుంచి ఈ కొత్త వెర్షన్ను థియేటర్లలో ప్రదర్శిస్తారు. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తీసిన సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో మూవీ టీమ్ సినిమాలో మార్పులు చేసింది.