News March 27, 2025

వరంగల్ : బైకును ఢీ కొట్టిన లారీ.. బాలుడు మృతి

image

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బైకుపై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గవిచర్లకి చెందిన గాలి చందు (17) బైక్‌పై ఆశాలపల్లి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కంటైనర్ లారీ ఢీకొట్టడంతో చందు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 3, 2025

వెంకటగిరి MLA గారూ.. ఈ రోడ్డును చూడండి

image

రోజూ వేలాదిమంది రాకపోకలు సాగించే వెంకటగిరి-గూడూరు రోడ్డు ఇది. రూ.40 కోట్లతో పనులు ప్రారంభించారు. 8నెలల కిందట పనులు ఆపేశారు. బాలాయపల్లె-అమ్మపాలెం మధ్య రోడ్డు దారుణంగా ఉండటంతో రాకపోకలకు రెట్టింపు సమయం అవుతోంది. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని MLA కురుగొండ్ల ఎప్పుడో ప్రకటించారు. ఈలోగా భారీ వర్షాలు రావడంతో ఇలా మారింది. మా MLA ఎప్పుడు పనులు చేయిస్తాడో ఏమో అని రోజూ వేలాది మంది ప్రశ్నిస్తూనే ఉన్నారు.

News November 3, 2025

పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలి: భూపాలపల్లి కలెక్టర్

image

జిల్లాలోని పలిమెల, మహాముత్తారం మండలాల్లో ఈ నెల 8 నుంచి 15వ తేదీ వరకు సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం పర్యటించనున్నందున, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీవోసీలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అధికారుల పర్యటన నిమిత్తం వారికి వసతి, భోజన సౌకర్యాలు ముందస్తుగా సిద్ధం చేయాలని అధికారులను సూచించారు.

News November 3, 2025

నరసాపురం: భారీ దొంగతనం కేసులో చేధించిన పోలీసులు

image

నరసాపురం(M) తూర్పుతాళ్లులో గతేడాది సెప్టెంబర్‌లో బంగారు షాపులో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు చేధించారు. సోమవారం ఎస్పీ నయీమ్ అస్మి తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతనానికి పాల్పడిన వారిలో నలుగురిని ఇవాళ అరెస్టు చేశారు. ఇదే కేసులో దొంగ బంగారం కొన్నట్లు తేలడంతో ముగ్గురు గోల్డ్ షాప్ యాజమానులపైనా కేసులు నమోదు చేశారు. మొత్తంగా 666గ్రా బంగారం, 2,638 గ్రాముల వెండి, నాలుగు బైక్స్ స్వాధీనం చేసుకున్నారు.