News March 27, 2025
భద్రాద్రి: జిల్లాలో కాంగ్రెస్ ప్రక్షాళన జరుగుతుందా?

కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18 ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో నేడు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో భాగంగా జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. KTDM జిల్లా డీసీసీ చీఫ్గా పోదెం వీరయ్య ఉన్నారు. అయితే ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు చాలామంది పోటీపడుతున్నారు. ఈ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.
Similar News
News April 2, 2025
వరంగల్ మార్కెట్లో ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల ఉత్పత్తులు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటా ధర రూ.28వేలు, సింగిల్ పట్టికి రూ.28,011 పలికింది. దీపిక మిర్చి క్వింటా ధర రూ.12,500, 1048 రకం మిర్చికి రూ.10వేలు, 5531 మిర్చికి రూ.9వేలు పలికినట్లు వ్యాపారులు తెలిపారు. .
News April 2, 2025
దేవాదాయ శాఖ కమిషనర్ను కలిసిన జిల్లా కలెక్టర్

భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణం, పట్టాభిషేకం మహోత్సవాల వేడుకలకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం జిల్లాకు వచ్చిన దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కలిసి స్వాగతం పలికారు. కళ్యాణం పట్టాభిషేకం మహోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ను దేవదాయ శాఖ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.
News April 2, 2025
ప్రపంచానికే సాయం.. భారత్ విపత్తు దౌత్యం

ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే విపత్తు సంభవించిందంటే మొట్ట మొదటిగా భారతే స్పందిస్తుంది. 1959లో టిబెట్ శరణార్థులకు ఆశ్రయం కల్పించడం నుంచి నిన్న మొన్నటి మయన్మార్ భూకంపంలో ‘ఆపరేషన్ బ్రహ్మ’ వరకు భారత్ చేసిన సాయం అంతాఇంతా కాదు. దీన్ని ‘విపత్తు దౌత్యం’గా విదేశీ వ్యవహారాల నిపుణులు వివరిస్తున్నారు. సాధారణ దౌత్యంతో కుదరని బలమైన సంబంధాల్ని ఈ దారిలో భారత్ సాధిస్తోందని కొనియాడుతున్నారు.