News March 27, 2025
భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎన్కౌంటర్

జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో భద్రతా బలగాల ఎన్కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతోంది. నేడు రాజ్బాగ్ సమీపంలోని ఘాటి జుథానాలో ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చారు. హిరానగర్ సెక్టార్లో ఆదివారం నాటి యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్లో తప్పించుకున్న ముష్కరులనే నేడు చంపేశారని సమాచారం. నాలుగు రోజులుగా ఇక్కడ టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతోంది.
Similar News
News April 1, 2025
తెలంగాణ కాంగ్రెస్ ఫ్లెక్సీలో YS జగన్ ఫొటో

TG: నల్గొండలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోను ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. సన్నబియ్యం పంపిణీకి వస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్వాగతం పలుకుతూ దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
News April 1, 2025
లోక్సభ ఎంపీలకు విప్ జారీ

రేపు లోక్సభ సమావేశానికి అందరూ హాజరుకావాలని తమ MPలకు బీజేపీ, కాంగ్రెస్ అధిష్ఠానాలు విప్ జారీ చేశాయి. లోక్సభలో కేంద్రం రేపు వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఓటింగ్లో పాల్గొనేందుకు ఎంపీలందరూ కచ్చితంగా రావాలని బీజేపీ అధిష్ఠానం చెప్పినట్లు సమాచారం. అటు కాంగ్రెస్ కూడా బిల్లుపై తీవ్ర నిరసనలు తెలిపే అవకాశం ఉంది.
News April 1, 2025
వడగాలులు, పిడుగులతో వర్షాలు.. రేపు జాగ్రత్త

AP: రాష్ట్రంలో రేపు 30, ఎల్లుండి 47 మండలాల్లో <