News March 27, 2025
పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.
Similar News
News January 13, 2026
కామారెడ్డి: సమ్మె బాటలో ఎన్ హెచ్ఎం ఉద్యోగులు

గత నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె బాటకు వెళ్లనున్నారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.విద్య కు సమ్మె నోటీసు అందించారు. వారు మాట్లాడుతూ.. రేయింబవళ్ళు కష్టపడుతున్న తమకు వేతనాలు సరైన సమయానికి అందించకపోవడమే కాకుండా తాత్సారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 22 నుంచి సమ్మెకు వెళ్తామని ఆమెకు తెలిపారు.
News January 13, 2026
కోదాడ: 3 ముక్కలుగా విరిగిన కోడి తొడ.. ఎముకకు పిన్నింగ్తో జాయింట్

కోదాడ ప్రభుత్వ పశు వైద్యశాలలో డాక్టర్ పెంటయ్య మూగ జీవాలకు వినూత్న చికిత్సలు చేసి వాటికి ప్రాణం పోస్తున్నారు. ఇందులో భాగంగా మూడు ముక్కలుగా విరిగిన కోడి తొడ ఎముకలకు పిన్నింగ్ ద్వారా అతికించి కోడి తిరిగి యధావిధిగా నడిచే విధంగా చికిత్స అందించారు. కాగా జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస రావు.. డాక్టర్ పెంటయ్య వినూత్న చికిత్సా విధానాన్ని అభినందించారు.
News January 13, 2026
సనాతన ధర్మాన్ని తుడిచేయడం అంత ఈజీ కాదు: అమిత్ షా

భారతదేశ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, ప్రజల విశ్వాసాన్ని తుడిచేయడం అంత సులభం కాదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఆయన మాట్లాడారు. సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు శతాబ్దాలుగా పదే పదే ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. దాడులు చేసిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని, ఆలయం మాత్రం సాగర తీరంలో సగర్వంగా నిలబడి ఉందని అన్నారు.


