News March 27, 2025

రిజర్వాయర్లలో పడిపోయిన నీటిమట్టాలు

image

దేశంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టాలు 45 శాతానికి పడిపోయినట్లు CWC నివేదిక ద్వారా తెలుస్తోంది. ఉత్తరాదిలో అయితే 25 శాతానికి పడిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న 155 ప్రధాన జలాశయాల సామర్థ్యం 18,080 బీసీఎంలు ఉండగా ప్రస్తుతం 8,070 బీసీఎంలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్-మే నెలల్లో ఈ నీటి నిల్వలు మరింతగా అడుగంటనున్నాయి.

Similar News

News April 1, 2025

వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

image

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ AJFCM కోర్టు తీర్పునిచ్చింది. ఓ భూవివాదంలో ఆత్కూరు పీఎస్‌లో వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు ఆ కేసును న్యాయస్థానం విచారించింది. వాదోపవాదాల అనంతరం ఈ నెల 15 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ తీర్పు చెప్పింది.

News April 1, 2025

రైల్ రోకో కేసు కొట్టేయండి.. హైకోర్టుకు కేసీఆర్

image

TG: 2011, అక్టోబరు 15న సికింద్రాబాద్‌లో నిర్వహించిన రైల్ రోకోకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టేయాలని BRS అధినేత KCR హైకోర్టును కోరారు. KCR పిలుపు మేరకే రోకో జరిగినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించగా, ఘటన సమయంలో ఆయన అక్కడ లేరని కేసీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వాదనలు ఆలకించిన ధర్మాసనం.. ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

News April 1, 2025

ఆటో ఛార్జీకి రూ.30 అడిగేవాడు.. కానీ ఇప్పుడు: హర్కేశ్

image

నిన్న KKRపై డెబ్యూ మ్యాచ్‌లోనే అశ్వనీకుమార్(MI) 4 వికెట్లు తీయడంతో తండ్రి హర్కేశ్ ఉప్పొంగిపోతున్నారు. అతను బుమ్రా, స్టార్క్‌లా రాణించాలని కలలు కనేవాడని చెప్పారు. ట్రైనింగ్ ముగించుకుని రా.10కి ఇంటికొచ్చి ఉ.6కే అకాడమీకి సైకిల్‌పై వెళ్లేవాడని గుర్తుచేసుకున్నారు. ఒక్కోసారి ఆటోలో వెళ్లేందుకు ₹30 అడిగేవాడని, ఇప్పుడు వేలంలో ₹30L సాధించాడని తెలిపారు. దాంతో పలువురికి క్రికెట్ కిట్లు విరాళంగా ఇచ్చారన్నారు.

error: Content is protected !!