News March 27, 2025

కర్నూలు జిల్లాలో ఎంపీపీ స్థానాలు వైసీపీ కైవసం

image

కర్నూలు జిల్లాలో వెల్దుర్తి, తుగ్గలి ఎంపీపీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. రెండు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. వెల్దుర్తి ఎంపీపీగా దేశాయి లక్ష్మిదేవమ్మ, తుగ్గలి ఎంపీపీగా రామాంజినమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ ఉప సర్పంచ్‌గా శాకీరాను వార్డు సభ్యులు ఎన్నుకున్నారు. మరోవైపు జడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఎన్నికకు వైసీపీ తరఫున మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.

Similar News

News April 2, 2025

కర్నూలు జిల్లాలో పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా.. మంగళవారం కర్నూలులోని సాయిబాబా సంజీవ నగర్‌లో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా వితంతు, వృద్ధాప్య పెన్షన్‌లను వారి ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పంపిణీ చేశామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు హాజరయ్యారు.

News April 1, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤కర్నూలులో మొదటి రోజు 93% పూర్తయిన పింఛన్ల పంపిణీ
➤ కర్నూలు: టెన్త్ పరీక్షలకు 430 మంది గైర్హాజరు-డీఈఓ
➤ కర్నూలు: సెక్షన్ 11 నోటీస్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు- సబ్ కలెక్టర్
➤ కర్నూలు జిల్లాలో 9 కరవు మండలాలు
➤ కర్నూలు జిల్లాలో వింత ఆచారం
➤ పెద్దకడబూరు: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
➤ కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

News April 1, 2025

కర్నూలులో మొదటి రోజు 93% పూర్తయిన పింఛన్ల పంపిణీ

image

కర్నూలు జిల్లాలోని 29 మండలాల్లో మంగళవారం చేపట్టిన పింఛన్ పంపిణీ 93% పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 2,38,302 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, మొదటి రోజు 2,21,701 మందికి పింఛన్ పంపిణీ పూర్తయింది. ఇంకా 16,601 మందికి పింఛన్ పంపిణీ చేయాల్సి ఉంది. కాగా జిల్లాలోని కర్నూల్ అర్బన్‌లో 95% పంపిణీతో మొదటి స్థానం, 88%తో తుగ్గలి మండలం చివరి స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

error: Content is protected !!