News March 25, 2024

క్రేన్ ఢీ.. వ్యక్తి శరీర భాగాలు నుజ్జు నుజ్జు 

image

హుజూర్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని క్రేన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి శరీర భాగాలు నుజ్జు నుజ్జు కాగా హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Similar News

News January 12, 2026

NLG: జిల్లాలో పెరుగుతున్న రాజకీయ వేడి!

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కారు అడుగులు వేస్తుండడంతో బల్దియాల్లో రాజకీయం వేడెక్కుతోంది. ఓటర్ల తుది జాబితా ప్రకటనకు ముందే రిజర్వేషన్లు ఎలా ఉంటాయి, అనుకూలించకపోతే ఏం చేయాలన్న విషయమై ఆశావహులు లెక్కలు వేసుకుంటున్నారు. NLG జిల్లాలో ప్రధానంగా NLG (ఇప్పుడు కార్పొరేషన్), MLG, CTL, DVK, HLY, CDR, నందికొండ, నకిరేకల్ వంటి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవాళ వార్డుల వారిగా తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు.

News January 12, 2026

NLG: కల చెదిరి.. కళ తప్పి

image

ఉమ్మడి జిల్లాలో గంగిరెద్దులను ఆడించే వారి జీవనం కష్టతరంగా మారింది. ఆదరణ కరువై, పొట్టకూటి కోసం వేరే పనులు చూసుకుంటున్నారు. ఏటా సంక్రాంతి సందర్భంగా రంగు రంగుల బట్టలు, గంటలు, మువ్వలతో ఇంటింటికీ తిరిగి అలరించే డూడూ బసవన్నల గొంతులు మూగబోతున్నాయి. ఆధునిక కాలంలో యాంత్రిక జీవనం పెరగడం, వినోద సాధనాలు మారడంతో ఈ కళ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. రాను రాను అంతరించిపోయిన జాబితాలో చేరేలా కనిపిస్తోంది.

News January 12, 2026

NLG: సర్కార్ మాటలకే పరిమితం.. కొత్త పథకం ఎక్కడా?

image

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మాటలకే పరిమితమైందన్న విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని పెంచుతామన్న హామీ కూడా ప్రభుత్వం మరిచిపోయిందని వృద్ధులు మండిపడుతున్నారు. జిల్లాలో వేలాదిమంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు.