News March 27, 2025
సింహాచలంలో అప్పన్న స్వామికి నిత్య కళ్యాణం

సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామికి గురువారం ఉదయం నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. బెల్లం, జీలకర్రతో పాటు ఊరేగిచారు. 108 స్వర్ణ పుష్పాలతో స్వామివారిని పూజించి భక్తులకు వేదాశ్వీరచనాలు, శేష వస్త్రాలు అందజేశారు. భక్తులు భారీగా తరలివచ్చారు. ఈవో సుబ్బారావు ఇతర సిబ్బంది పర్యవేక్షించారు. అన్నదానం ఏర్పాట్లు చేపట్టారు.
Similar News
News January 4, 2026
రేపు విశాఖ పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

ప్రజల సమస్యల పరిష్కారం కోసం విశాఖ సిటీ పోలీస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తోంది. సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు జనవరి 5న ఉదయం 10 గంటల నుంచి ఆర్ముడ్ రిజర్వ్ ఆఫీస్లోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. బాధితులు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడమే తమ ప్రాధాన్యత అని సీపీ స్పష్టం చేశారు.
News January 4, 2026
గాజువాక లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య.. పక్కనే ‘సూసైడ్ నోట్’

గాజువాకలోని ఓ లాడ్జిలో మోహన్ రాజు అనే వ్యక్తి శనివారం రాత్రి <<18758829>>ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఈరోజు ఉదయం ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ‘షేర్ మార్కెట్ నా జీవితాన్ని నాశనం చేసింది. నువ్వు చెప్పినా వినకొండ పెట్టుబడి పెట్టి నష్టపోయాను. అశ్విని నీకేమీ చేయలేకపోయాను తల్లి. ఎవరినీ సహాయం అడగాలనిపించలేదు’ అంటూ 7 పేజీల నోట్ రాసి ఉంది.
News January 4, 2026
VCSC నూతన కార్యవర్గం ప్రకటన.. పౌర భద్రతే లక్ష్యం

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ మార్గదర్శకత్వంలో విశాఖ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (VCSC) నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. సైబర్ సెక్యూరిటీ, మహిళా-శిశు సంరక్షణ, ట్రాఫిక్, యాంటీ నార్కోటిక్స్ విభాగాలకు ప్రత్యేక ఫోరమ్లను ఏర్పాటు చేశారు. కళాశాలల్లో అవగాహన సదస్సులు, ‘జూనియర్ కాప్’, ‘సైబర్ వారియర్స్’ వంటి కార్యక్రమాల ద్వారా పోలీస్-ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.


