News March 27, 2025

కొడంగల్: భూమి పూజ చేసిన సీఎం సోదరుడు

image

కొడంగల్ పరిధి మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని రెనివట్ల గ్రామంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి భూమి పూజా కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్‌తో పాటు, కడా ఛైర్మన్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 1, 2025

కేసీ వేణుగోపాల్‌ను కలిసిన ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్యేలు

image

ఢిల్లీలో ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని ఎమ్మెల్యేలంతా కలిసినట్లు సమాచారం. కలిసిన వారిలో ఎమ్మెల్యేలు టీ. రాంమోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య ఉన్నారు.

News April 1, 2025

పాస్టర్ మృతిపై రెండు రోజుల్లో నివేదిక: హోం మంత్రి

image

పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల అనుమానాస్పద మృతిపై పోలీసులు లోతుగా విచారణ నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో హోం మంత్రిని రాష్ట్ర పాస్టర్స్ యూనియన్ ప్రతినిధులు కలిసి ప్రవీణ్ మృతిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందన్నారు.

News April 1, 2025

విజయ్ చివరి సినిమా OTT రైట్స్‌కు ₹121కోట్లు!

image

తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఓటీటీ రైట్స్‌ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తాన్ని చెల్లించినట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనికోసం ఏకంగా రూ.121 కోట్లు చెల్లించి ‘జన నాయగన్’ పాన్ ఇండియా ఓటీటీ హక్కులు పొందినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ తెరకెక్కిస్తున్నారు.

error: Content is protected !!