News March 27, 2025

ఉమ్మడి కరీంనగర్‌లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన

image

రాజన్న సిరిసిల్లలో జిల్లాలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుల పర్యటన వివరాలను ఛైర్మన్ బక్కి వెంకటయ్య విడుదల చేశారు. జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ 3, 4 తేదీల్లో దళితులపై చేసే దారుణాలు, భూ సమస్యలపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి బాధితులకు ఎలాంటి చట్టపరమైన సహాయం చేయనున్నట్లు తెలిపారు. సహాయనిధి, నిందితుల తీరుని ఎలా కట్టడి చేస్తున్నారు అనేదానిపైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.

Similar News

News September 18, 2025

VZM: ఓపెన్ కేటగిరి బార్లకు లాటరీ విధానం ద్వారా ఎంపిక

image

జిల్లాలో ఓపెన్ కేటగిరి బార్లకు లాటరీ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ బుధవారం విజయవంతంగా పూర్తయింది. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, జేసీ సేతు మాధవన్ సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 16 అప్లికేషన్లు అందగా, వాటి ద్వారా రూ.81.6 లక్షలు వచ్చాయని జిల్లా అబ్కారీ శాఖ అధికారి బమ్మిడి శ్రీనాథుడు తెలిపారు. లాటరీ ప్రక్రియలో జిల్లాలో నాలుగు బార్లకు ఎంపిక జరిగిందన్నారు.

News September 18, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(పట్టణ రవాణా శాఖ)గా బాధ్యతలు.. CM రేవంత్‌ను కలిసిన NVS రెడ్డి
* SEP 21న చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ ఆడనున్న కల్వకుంట్ల కవిత
* HYDలో భారీ వర్షం.. GHMC, హైడ్రా, పోలీస్, విద్యుత్ విభాగాలు సమన్వయం చేసుకోవాలన్న మంత్రి పొన్నం
* మూసీకి వరద.. అంబర్‌పేట్-మూసారాంబాగ్ బ్రిడ్జి క్లోజ్
* SEP 21-30 వరకు జరిగే బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్దఎత్తున పాల్గొనాలి: మంత్రి జూపల్లి

News September 18, 2025

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

పత్తి కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు మద్దతు ధర (MSP) కింద తగిన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.