News March 27, 2025
మంచిర్యాల: ఈ నెల 28న మినీ జాబ్ మేళా

మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 28న ఉదయం10.30గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ తెలిపారు. అపోలో ఫార్మసీ మంచిర్యాల, గోదావరిఖని, హైదరాబాద్లో ఫార్మసిస్ట్ 40, ట్రైనింగ్ ఫార్మాసిస్ట్ 20, ఫార్మసీ అసిస్టెంట్30, రిటైల్ ట్రైనీ అసిస్టెంట్10ఖాళీలు ఉన్నాయన్నారు.18నుంచి 35లోపు వయస్సు, అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 17, 2025
శ్రీకాకుళం జిల్లాలో భారీగా పడిపోయిన బంతి పూల ధరలు

శ్రీకాకుళం జిల్లాలో బంతి పూల ధరలు భారీగా పడిపోయాయి. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వినాయక చవితి సమయంలో కిలో రూ.50-60 పలకగా ఆ తర్వాత ధర క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీకి రూ.20 కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కిలోకు రూ. 35-40 వరకూ వస్తే పెట్టుబడులైనా దక్కుతాయని అంటున్నారు. రాబోయే దసరా సీజన్ పైనే బంతిపూల రైతులు ఆశలు పెట్టుకున్నారు.
News September 17, 2025
ఒత్తైన జుట్టుకు బియ్యం నీళ్లు

ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య పెరిగింది. అయితే హెయిర్లాస్ ఎక్కువ ఉంటే బియ్యం కడిగిన నీళ్లతో చెక్ పెట్టొచ్చు. బియ్యం నీటితో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే అమినో ఆమ్లాలు, విటమిన్ బీ, ఈ, సీలు జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. అలాగే రాత్రి బియ్యం నానబెట్టిన నీటిని వడకట్టి ఉదయాన్నే తలకు పట్టించి అరగంట తర్వాత కడుక్కోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
News September 17, 2025
NGKL: తెలంగాణ సాయుధ పోరాటంలో అప్పంపల్లి కీలకం

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో MBNR జిల్లాలోని అప్పంపల్లి గ్రామం కీలక పాత్ర పోషించింది. ఈ గ్రామం నుంచి 11 మంది పోరాటంలో పాల్గొని అమరులయ్యారు. పోరాటంలో చాకలి కిష్టన్నను నిజాం పాలకులు మొదట చంపినా, లింగోజిరావు వంటి వీరులు వెనుకడుగు వేయకుండా నిజాంకు వ్యతిరేకంగా పోరాడి, తెలంగాణ విలీనానికి కృషి చేశారని చరిత్ర చెబుతోంది.