News March 25, 2024
నిజామాబాద్: పడిపోయిన పసుపు ధరలు

నిజామాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అల్టైం రికార్డు ధర పలికిన పసుపు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. పది రోజుల క్రితం గరిష్ఠంగా రూ.18,299 పలికిన పసుపు రూ.1,500 వరకు తగ్గడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం మార్కెట్లో పసుప ధర గరిష్ఠంగా క్వింటాలుకు రూ.16,666 ఉంది. దానికి తోడు ఈ నెలాఖరు వరకు రెండు రోజులు మాత్రమే పసుపు కొనుగోళ్లు సాగుతాయని మార్కెట్ అధికారులు వెల్లడించారు.
Similar News
News November 1, 2025
UPDATE: ఘటనా స్థలాన్ని పరిశీలించిన NZB CP

నవీపేట్ మండలం ఫకీరాబాద్ -మిట్టాపల్లి రహదారిలో ఓ మహిళను <<18166463>>వివస్త్రగా చేసి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే.<<>> విషయం తెలుసుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్తో పరిశీలన చేయించారు. నవీపేట్ మండలంలో మహిళల హత్యలు వెలుగు చూస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వారం వ్యవధిలో ఇది రెండవ హత్య కావడం గమనార్హం.
News November 1, 2025
వర్ని: బాలికపై లైంగిక దాడి.. యువకుడిపై పోక్సో కేసు

వర్నిమండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై గణేష్ (24)అనే యువకుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడగా బాలిక గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం ఆమెకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వర్ని SI మహేష్ తెలిపారు.
News October 31, 2025
నిజామాబాద్లో పోలీస్ల కొవ్వొత్తుల ర్యాలీ

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో పట్టణంలోని కోర్ట్ చౌరస్తా నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేవని కొనియాడారు. వారి వల్లే సమాజంలో శాంతి నెలకొందన్నారు. పోలీస్ శాఖ ఎప్పుడు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు.


