News March 27, 2025

JKలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

image

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. కథువాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. కాగా ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.

Similar News

News April 1, 2025

కర్ణాటకలో డీజిల్ ధర పెంపు

image

కర్ణాటకలో డీజీల్ ధరలు పెరగనున్నాయి. డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం 21.7% శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో లీటరు డీజీల్ ధర ₹2 పెరిగి ₹91.02కి చేరుకోనుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే బెంగళూరులో ఇవాళ్టి నుంచి చెత్త పన్ను కూడా వసూలు చేయనుంది. నివాస భవనాల విస్తీర్ణాన్ని బట్టి నెలకు ₹10 నుంచి ₹400 వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

News April 1, 2025

2029కి రూ.50వేల కోట్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: రాజ్‌నాథ్

image

FY2025లో భారత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.23,622 కోట్లకు చేరినట్లు డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. FY24తో(రూ.21,083 కోట్లు) పోలిస్తే 12.04 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. ఈ విజయంలో భాగమైన అందరికీ అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంలో 2029 నాటికి రక్షణ ఎగుమతులను రూ.50వేల కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. డిఫెన్స్ రంగంలో ఇది గర్వించదగ్గ మైలురాయి అని PM కొనియాడారు.

News April 1, 2025

ఇళ్ల నిర్మాణం కోసం రూ.3220 కోట్ల అదనపు సాయం: ప్రభుత్వం

image

AP: SC, ST, BC, ఆదివాసీ గిరిజనుల(PVTG) వర్గాల లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలో అసంపూర్తిగా ఉన్నవాటి నిర్మాణం కోసం రూ.3220 కోట్ల అదనపు సాయాన్ని కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ‘మారిన ఖర్చుకు తగిన విధంగా ఎస్సీలకు రూ.50వేలు, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు, ఆదివాసీ గిరిజనులకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నాం’ అని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ MD రాజబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

error: Content is protected !!